కాకతీయ, పరకాల : ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఇంజనీర్స్ డే సందర్భంగా మండలంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ నోముల శ్రీలత, హౌసింగ్ ఏఈ పోకల ఆకాంక్షను ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు సోమవారం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అంటే కేవలం చదువు మాత్రమే కాదని, దేశ అభివృద్ధికి ఒక దిశ అన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సిహెచ్ శైలశ్రీ, తదితరులు పాల్గొన్నారు.


