పేద విద్యార్థినికి చేయూత
సైకిల్, బియ్యం పంపిణీ
కాకతీయ, ఏటూరునాగారం: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడం గొప్ప సేవ అని మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి అన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఒక పేద విద్యార్థినికి సైకిల్తో పాటు 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఇతర విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి విద్యాపట్ల ప్రోత్సాహం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయుడు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఉపాధ్యాయుడు సతీష్ను శాలువాతో సత్కరించగా, అనంతరం రేగ కళ్యాణిని కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిటమట రఘు, గికురు భాగ్య, రామన్నగూడెం సర్పంచ్, యూత్ నాయకులు గద్దల నవీన్, గంపల శివకుమార్, ఉపాధ్యాయులు, పెద్దలు పాల్గొన్నారు.


