epaper
Thursday, January 15, 2026
epaper

పంచాయ‌తీ ఎన్నికలకు భారీ బందోబ‌స్తు

పంచాయ‌తీ ఎన్నికలకు భారీ బందోబ‌స్తు
క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని విధుల్లో 2 వేల మంది పోలీసులు
పోలింగ్‌ కేంద్రాల వద్ద పెట్రోలింగ్‌ పెంపు
2,205 మంది బైండోవ‌ర్‌..
అల్లర్లకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు
వ‌రంగ‌ల్ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ హెచ్చరిక

కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రేపు జరగనున్న గ్రామ పంచాయితీ మొదటి విడత ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు మొత్తం 2 వేలకుపైగా పోలీసు సిబ్బందిని నియమించినట్లు పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు ఇలా వెల్లడించారు.. బందోబస్తు బలగాలకు సంబంధించి ముగ్గురు డీసీపీలు, 5 మంది అదనపు డీసీపీలు, 13 మంది ఏసిపిలు, 28 మంది ఇన్‌స్పెక్టర్లు, 122 మంది ఎస్‌.ఐలు, 412 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 1,154 మంది కానిస్టేబుళ్లు, 285 మంది హోంగార్డులు, డిస్ట్రిక్ట్‌ గార్డ్స్‌, బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలు, ప్రతి మండలానికి ఒక ఏసిపిని ఇన్‌చార్జ్‌గా నియమించగా, అదనపు డీసిపి పర్యవేక్షణలో ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎస్‌.ఐ, ఏఎస్‌.ఐతో పాటు తగిన సంఖ్యలో కానిస్టేబుళ్లను మోహరించినట్లు చెప్పారు. రూట్‌ మొబైల్‌ టీంలు, షాడో పార్టీలు, మొబైల్‌ పార్టీలు నిరంతర పెట్రోలింగ్‌ నిర్వహిస్తాయని చెప్పారు.

గ్రామాల్లో ముమ్మర తనిఖీలు

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి చెక్‌పోస్టుల వద్ద భారీ వాహన తనిఖీలు చేపట్టినట్లు కమిషనర్‌ తెలిపారు. గ్రామాల్లో కూడా ముమ్మర తనిఖీలు జరిగాయని చెప్పారు. స్వాధీనం చేసిన నగదు.. రూ. 6,04,000, 120 కేసుల్లో మద్యం సీసాలు రూ. 10.69 లక్షల విలువ, 46 కేసుల్లో గుడుంబా 322 లీటర్లు దాదాపు రూ. 1.19 లక్షల విలువ ఉంటుందని, తెలిపారు. స్వాధీనం చేసిన గంజాయి రూ. 1 లక్ష విలువ, లైసెన్స్‌ ఉన్న తుపాకులు 156 స్వాధీనం చేసుకున్నారని, అలాగే గతంలో ఎన్నికల వివాదాలకు సంబంధించిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి పెట్టి 384 కేసుల్లో 2,205 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు.

ప్రజలకు కమిషనర్‌ విజ్ఞప్తి..

ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసిన పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలకు విఘాతం కలిగించే చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img