epaper
Monday, March 2, 2026
epaper

విజయవాడలో పట్టుకొని అడ‌విలో కాల్చి చంపిండ్రు

  • హిడ్మా ఎన్‌కౌంట‌ర్ బూట‌కం
  • 15న తేదీన ఏపీలో అదుపులోకి..
  • ద్రోహి స‌మాచారంతో క్రూరంగా హత్య‌
  • హిడ్మా, రాజే, శంకర్, ఇతర కామ్రేడ్లకు విప్లవ జోహార్లు
  • అమ‌రుల స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం
  • మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
  • 23న దేశవ్యాప్తంగా నిరసన దినం
  • అభయ్ పేరుతో ప్రెస్ నోట్ రిలీజ్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, నిరాయుధులైన తమ నేతలను పోలీసులు పట్టుకొని హత్య చేశారని ఆరోపించింది. అభయ్ పేరుతో శుక్ర‌వారం ప్రెస్ నోట్ విడుద‌లైంది. కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే మరికొందరితో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడ వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో, కొందరి ద్రోహంవల్ల సమాచారం పోలీసులకు చేరింది. నవంబర్ 15న కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఐబీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లొంగిపోవాలని ఒత్తిడి చేసి, వారు నిరాకరించడంతో క్రూరంగా హత్య చేసి, మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని లేఖలో ఆరోపించారు. రంపచోడవరంలో ఏవోబీ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌ను కూడా ఇలాగే హత్య చేశారని పేర్కొన్నారు.

23న దేశవ్యాప్తంగా నిరసన

ఈ బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఈ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రాణాలు అర్పించిన హిడ్మా, రాజే, శంకర్, ఇతర కామ్రేడ్లకు విప్లవ జోహార్లు అర్పిస్తూ, వారి స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని శపథం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద, మారేడుమిల్లి ఘటనపై పోలీసుల కథనానికి పూర్తి భిన్నమైన వాదనను మావోయిస్టు పార్టీ తమ లేఖ ద్వారా ముందుంచ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయ‌మైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img