epaper
Saturday, November 15, 2025
epaper

సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి

  • మిల్లర్లకు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి
  • 266 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
  • జిల్లా కలెక్టర్ డాక్టర్  సత్య శారద

కాకతీయ, వరంగల్ ప్రతినిధి:  జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ధాన్యం సేకరణపై   మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని, కొనుగోలు కేంద్రాల్లో సరియైన తూకం, తేమ శాతం, రవాణా, నిల్వ వంటి అంశాలలో పారదర్శకత ఉండేలా  చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిల్లర్లు ధాన్యాన్ని సమయానికి దిగుమతి చేసుకోవాలని సూచించారు. లారీ ట్రాన్స్‌పోర్టర్లు సకాలంలో రవాణా ఏర్పాట్లు చేసి, రైతుల ధాన్యం ఎక్కడా ఆగకుండా చూడాలన్నారు.

ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు రెండు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా అందుకు గాను 266 ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయుటకు  ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ లో ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు సెంటర్లను గతంలో కంటే 65 ఎక్కువ పెంచడం జరిగిందని, ఇందుకు గాను లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు కూడా ధాన్యం రవాణాకు వాహనాలు పెంచాలన్నారు. మిల్లర్లు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి అని, మిల్లింగ్ కెపాసిటీ ప్రకారం బ్యాంకు గ్యారంటీ చెల్లించాలని కలెక్టర్ చెప్పారు.

ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ సమస్యలు రాకుండా, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిఎంఓ సురేఖను ఆదేశించారు. రవాణా, బార్దాను సమస్య రాకుండా చూడాలని డీఎంను, రైస్ మిల్లర్ల ట్యాగింగ్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని డీసీఎస్ఓను ఆదేశించారు. ట్రక్ షీట్ లేని వాటిని లోడింగ్ చేయకూడదని, ప్యాడీ క్లీనర్ ద్వారా శుద్ది చేసిన ధాన్యాన్ని సెంటర్లోకి వచ్చేలా చూడాలని డీసీఓ నీరజ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జడ్పీ సీఈఓ ఇంచార్జ్, డీఆర్‌డీఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ,  రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనెల రవీందర్, కార్యదర్శి సత్యనారాయణ, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img