epaper
Monday, March 2, 2026
epaper

ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి

ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి
వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మ‌హ‌బూబాబాద్‌ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో స‌మీక్ష‌

కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, రవాణా, వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష చేపట్టారు.

ధాన్యం మిల్లులకు వెంటనే తరలించాలి

కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని, ఇందుకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాతావరణంలో మార్పులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తు సమాచారం అందించాలని, సంబంధిత సిబ్బంది అంతా ఫీల్డ్‌లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

వసతి గృహాలపై నిత్య తనిఖీలు జ‌ర‌గాలి
ప్రస్తుత శీతాకాల పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని వసతి గృహాలను ప్రత్యేక అధికారులు, హాస్టల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు నిత్యం తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని, వారికి సరిపడా దుప్పట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. వసతి గృహాల్లో డైట్ మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన వేడి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ఏడీ ఎస్ఎల్ఆర్ నరసింహ మూర్తి, జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, డీఎస్ఓ రమేష్‌తో పాటు మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. అలాగే అన్ని మండల కేంద్రాల నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, ఎంపీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img