epaper
Sunday, March 1, 2026
epaper

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం
ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్ వర్మ
విద్యాసంస్థల్లో ఎన్‌సీసీకి మరింత ప్రోత్సాహం ఇవ్వాల‌ని పిలుపు

కాకతీయ, హైదరాబాద్ : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రిపబ్లిక్ డే పరేడ్–2026లో తెలంగాణ తరఫున న్యూఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన ఎన్‌సీసీ అధికారులు, కేడెట్లను శనివారం లోక్ భవన్‌లో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. దేశ నిర్మాణంలో యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ చేస్తున్న సేవలు అమూల్యమైనవని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సీసీ శిక్షణ శిబిరాలు కేడెట్లలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, క్రమశిక్షణ వంటి గుణాలను పెంపొందిస్తాయని గవర్నర్ తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే భావనను యువతలో బలంగా నాటేందుకు ఎన్‌సీసీ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. విద్యాసంస్థలు తమ విద్యార్థులను ఎన్‌సీసీ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనేలా ప్రోత్సహించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవడితే, భవిష్యత్తులో సమాజానికి ఉత్తమ సేవకులుగా మారతారని ఆయన అభిప్రాయపడ్డారు.
రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచిన కేడెట్లకు, అలాగే వారి వెంట ఉన్న సీనియర్ ఎన్‌సీసీ అధికారులకు గవర్నర్ జ్ఞాపికలను అందజేసి అభినందించారు. వారి కృషి రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎన్. సైలాని, ఇతర సీనియర్ ఎన్‌సీసీ అధికారులు, లోక్ భవన్ అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img