epaper
Monday, March 2, 2026
epaper

ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయుల కృషిని గుర్తించాలి: TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరించాలనీ TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రైవేట్ ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

దాదాపు 15 సంవత్సరాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కోసం, హక్కుల సాధన కోసం , సమస్యల పరిష్కారం కోసం , సంక్షేమం కోసం, వారి ఐక్యత కోసం TPTF వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం కొనసాగుతదనీ, అందుకు మీ అందరి భాగస్వామ్యం కూడా చాలా అవసరమనీ , మీరు ఛైతన్యమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.

రాష్ట్రంలో దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులకు 3 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. వారి అర్హతకు తగిన జీతం లేదు, సమయానికి జీతాలు రావు. ప్రభుత్వ సెలవులు ఉండవు, ప్రభుత్వ సమయ వేళలు ఉండవు. 12 నెలల జీతం ఉండదు, ESI, PF వంటి సౌకర్యాలు ఉండవు. ఇన్ని సమస్యలతో చెలగాటం ఆడుతూ మరోపక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులు.

పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ ఉపాధ్యాయుల శిక్షణలో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించడం మన కృషికి నిదర్శనం. మరి ఇంత కష్టపడుతున్న ఉపాధ్యాయులను ఎవరు గుర్తిస్తున్నరు? ఎవరు గౌరవిస్తున్నరు? ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సెప్టెంబర్ 5 న జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున వారిని ఎందుకు గుర్తించి సత్కరించడం లేదు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించి తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనీ, అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలతో సత్కరించాలనీ కోరారు. ఈ సమావేశంలో గీసుగొండ మండల అధ్యక్షుడు దామెర సూర్యచంద్ర, సంగెం మండల అధ్యక్షుడు ఎల్కుర్తి రవి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాథోడ్, జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాకూబ్ పాషా, గీసుగొండ మండల ఉపాధ్యక్షులు అశోక్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img