epaper
Saturday, November 15, 2025
epaper

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాకతీయ, నర్సంపేట: యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 50వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు. శుక్రవారం ఖానాపురం మండలంలోని మంగళవారిపేట ,గొల్లగూడెంతండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా పంపిణీలో జాప్యం చేస్తున్న ఖానాపురం మండల వ్యవసాయ అధికారినీ తక్షణమే సస్పెండ్ చేయాలని, యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ అధికారుల పైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు.

గొల్లగూడెం తండాకు చెందిన రైతుకుటుంబం తేజవత్ శ్రీను స్రవంతిల ఆరెకరాల మొక్కజొన్న పంటకు యూరియా అందక , పశువులను మేపడంతో పంట నష్టపోయిన లావుడియా రాము లలిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పంటను పరిశీలించారు. యూరియా కొరత వలన గిరిజనులతోపాటు సన్న చిన్న కారి రైతుల యొక్క పత్తి, వరి, మొక్క జొన్న, పంటలు పూర్తిగా ఎర్రబడి పోతున్నాయి. పశువులను మేపే దుస్థితి వచ్చిందని, దీనికి ముమ్మాటికీ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు నైతిక బాధ్యత వహించాలని అన్నారు.

పంటలకు పెట్టుబడి మొత్తం పూర్తయినదని, కోత దశ ఏరుకునే దశకు వచ్చింది, ఒక యూరియా బస్తా దొరికితే ప్రతి ఎకరానికి లక్షల రూపాయల విలువచేసే వివిధ పంటల దిగుబడి రైతుల చేతికి వచ్చేటువంటి చివరి సమయంలో యూరియా బస్తా కోసం పది రోజుల నుండి పదిసార్లు లైన్ లో నిలబడ్డ అస్వస్థకు గురైన భార్య ,పిల్లలతో, చిన్నపిల్లలతో, భుజాన ఎత్తుకొని లైను నిలబడ్డప్పటికీ కూడా యూరియా కరువైందని, ఇది ముమ్మాటికి విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు 3 పంటల సంబంధించి ఎకరాకు 50 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కూడా ఎర్రబడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని లేని యెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా నర్సంపేట నియోజకవర్గం లో తీవ్రమైన నిరసనలు ఉంటాయని ప్రభుత్వంన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఏ ముఖం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారని, ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా కూడా లేదు మీకు తప్పించుకొని తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు RFOR పట్టాలు ఇచ్చారని, సకాలంలో రైతుబంధు ఇవ్వడంతో పంట పెట్టుబడికి అంది దిగుబడి వచ్చిందిని, మద్దతు ధరకు కొనుగోలు చేశారని కానీ ప్రస్తుతం అన్ని కోల్పోయి రైతులు బజార్న పడే పరిస్థితి వచ్చిందన్నారు.

రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందిని, తీవ్రమైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు మనోధైర్యం కోల్పోకుండా పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రతి పంటకు ఎకరాకు 50 వేల రూపాయలు ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని, తీవ్రమైన నిరసనలకు సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట నర్సయ్య, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img