ప్రభుత్వ మిషన్లు ఎండకే అంకితం!
తిమ్మరాన్పహాడ్లో నిర్లక్ష్యానికి పరాకాష్ట
కోట్ల ప్రజాధనం వృథా అవుతున్న వైనం
కాకతీయ, నర్సంపేట టౌన్ : అమినాబాద్ సొసైటీ పరిధిలోని తిమ్మరాన్పహాడ్ గ్రామంలో ఐకేపీ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రైతుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలతో పంపిన వడ్ల మిషన్లు వినియోగం లేక ఎండలోనే పడి దెబ్బతింటున్నాయి. షెడ్లో భద్రపరచాల్సిన యంత్రాలను బహిరంగంగా వదిలేయడంతో బెల్టులు, మోటార్లు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్లు షో కోసం కాదని, వినియోగానికి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణ తనిఖీలు చేసి యంత్రాలను గోదాంలకు తరలించి, బాధ్యత లేని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


