epaper
Thursday, January 15, 2026
epaper

Gold Rate Today: పసిడిప్రియులకు బిగ్ రిలీఫ్..దిగివస్తున్న బంగారం ధరలు..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: ఇటీవల వరుసగా రికార్డులు సృష్టించిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ఎగిసిపడుతూ కొత్త గరిష్టాలను తాకింది. అయితే తాజాగా వరుసగా రెండో రోజు ధరలు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.600 పడిపోగా, ప్రస్తుతం అది రూ.1,13,200గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.500 తగ్గి రూ.1,12,800గా ఉంది. ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం అమెరికా ఫెడ్ రిజర్వ్ తీసుకున్న వడ్డీ రేట్ల నిర్ణయమే.

తొమ్మిది నెలల విరామం తర్వాత ఫెడ్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒత్తిడికి గురై పతనమయ్యాయి. వ్యాపారుల అభిప్రాయం ప్రకారం వడ్డీ రేట్లు తగ్గడంతో డిమాండ్ తగ్గి, బంగారం ధరలపై నేరుగా ప్రభావం పడింది. ఈ ఏడాది చివరి నాటికి మరికొన్ని సార్లు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.ప్రపంచ మార్కెట్లో కూడా పసిడి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.23 శాతం పెరిగి 3,668.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి కూడా స్వల్ప పెరుగుదలతో 0.55 శాతం లాభపడి ఔన్సుకు 41.90 డాలర్ల వద్ద నిలిచింది.

స్థానికంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,11,170గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,01,900కి పడిపోయింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉండి కిలోకు రూ.1.41 లక్షల వద్ద కొనసాగుతోంది. మొత్తంగా, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల ప్రభావంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించగా, దేశీయంగా కూడా బంగారం ధరలు కొంత తగ్గాయి. ఇది కొనుగోలుదారులకు తాత్కాలిక ఊరట కలిగించిందని నిపుణులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో వడ్డీ రేట్ల మార్పులు, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి పసిడి ధరలు మళ్లీ పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్నది చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

భూపాల్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కాకతీయ, ములుగు ప్రతినిధి :...

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు

ఏసీపీ నందిరాంపై సస్పెన్ష‌న్ వేటు ఆయ‌న‌తో పాటు ఇన్‌స్పెక్టర్‌ గోపి, ఎస్‌ఐ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img