కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లిలోని సంఘమిత్ర డిగ్రీ & పీజీ కళాశాలలో గౌడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (జీజీఈఏ) భూపాలపల్లి యూనిట్ ఆధ్వర్యంలో తొలి సన్నాహక సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న గౌడ కమ్యూనిటీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘానికి మద్దతు తెలిపారు. సమావేశంలో గౌడ కమ్యూనిటీ ఐక్యత, అభివృద్ధి, యువత ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అంశాలపై పలు తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
ముఖ్యంగా.. చదువులో, పోటీ పరీక్షల్లో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రతి సంవత్సరం సన్మానించడం. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని ప్రత్యేక కార్యక్రమాలలో గౌరవించడం. జాతిపిత సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్థంతి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం. గౌడ ప్రభుత్వ ఉద్యోగుల సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసి, అధికారిక రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం. 2026 సంవత్సరానికి ప్రత్యేక క్యాలెండర్, డైరీలను జీజీఈఏ తరపున ప్రచురించడం. కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై సంఘం తరపున అధికారికంగా స్పందించడం. సంప్రదాయ బంధాన్ని బలోపేతం చేసే కార్తీక వన బోజనాలను నిర్వహించడం.
అడ్-హాక్ కమిటీ సభ్యులు..
ఈ సందర్భంగా తాత్కాలిక అడ్-హాక్ కమిటీని ప్రకటించారు. కన్వీనర్ బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్, కో-కన్వీనర్ చిర్ర రఘు గౌడ్, సభ్యులు.. దాసరి చంద్రమౌళి గౌడ్, వేముల సదానందం గౌడ్, తోట సురేష్ గౌడ్, కాసగాని తిరుపతి గౌడ్, మూల తిరుపతి గౌడ్, ఉమ్మగాని క్రాంతి గౌడ్, గండి రాజ్ కుమార్ గౌడ్, ముక్కెర ధనుంజయ్ గౌడ్, పెసరు నాగరాజు గౌడ్, గుర్రం రాజు గౌడ్, ముక్కెర హేమంత్ గౌడ్, బాలవేని రాంబాబు గౌడ్, అంబటి దేవెందర్ గౌడ్, గట్టు కపిల్ గౌడ్. ఈ కమిటీ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తూ, రాబోయే ప్రధాన సమావేశంలో శాశ్వత కమిటీని ఎన్నుకోనుంది.
ఈ సందర్భంగా కన్వీనర్ బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ.. మన గౌడ కమ్యూనిటీకి ఉద్యోగాల్లో, విద్యలో, సేవా కార్యక్రమాల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచేలా జీజీఈఏ పనిచేస్తుంది. సమాజ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం అన్నారు. భూపాలపల్లి పరిసర ప్రాంతాల నుండి అనేక మంది గౌడ ప్రభుత్వ ఉద్యోగులు హాజరై సంఘం ప్రారంభానికి మద్దతు తెలిపారు.
సమాజ అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాల్లో కొత్త ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించారు. యువతకు ప్రేరణ కలిగించేలా సన్మాన కార్యక్రమాలు, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసేలా పాపన్న జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశం విజయవంతంగా నిర్వహించ బడటం గౌడ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమని, భవిష్యత్తులో సంఘం మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడుతుందని పాల్గొన్న ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.


