డోర్నకల్ కోఆర్డినేటర్గా గాజర్ల అశోక్
మేడ్చల్ విజయంతో కీలక బాధ్యతలు
మున్సిపల్ పోరుకు టీపీసీసీ ప్రత్యేక వ్యూహం
కాకతీయ, హైదరాబాద్/మహబూబాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల కోఆర్డినేటర్గా టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతు)ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ కార్యవర్గ కూర్పులో టీపీసీసీ పరిశీలకుడిగా అశోక్ కీలక పాత్ర పోషించారు. మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో పర్యటించి గ్రూపు రాజకీయాలకు తావులేకుండా పార్టీ శ్రేణులను సమన్వయం చేశారు. సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాతినిధ్యాన్ని పరిగణలోకి తీసుకుని 108 మందితో కూడిన సమతుల్య కార్యవర్గాన్ని రూపొందించడంలో ఆయన చూపిన సమర్థత పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకుంది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను అశోక్కు అప్పగించినట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. స్థానిక నాయకత్వం–జిల్లా కమిటీల మధ్య వారధిగా ఉంటూ ప్రచార వ్యూహాలను రూపొందించడం, అభ్యర్థుల సమన్వయం, గ్రూపుల ఐక్యత వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన అశోక్ నియామకంపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగనున్నారు.


