epaper
Saturday, March 7, 2026
epaper

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా

భూదాన్ పేరిట కోట్లు దోచిన ముఠా
కమిటీ సభ్యులమంటూ నిరుపేదల నుంచి రూ.3 కోట్లు వసూళ్లు
నకిలీ పట్టాలు, అక్రమ కేటాయింపులు బట్టబయలు
వెలుగుమట్ల భూ వివాదంపై ఇప్పటికే 19 కేసులు
ఇప్పటివరకు 9 మంది అరెస్ట్… కొన‌సాగుతున్న ద‌ర్యాప్తు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి నిరుపేదలను మోసం చేసిన ముఠా వ్యవహారం ఖమ్మంలో వెలుగుచూసింది. యూసిసీఆర్ఎల్ (యంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేస్తూ వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన నిరుపేదల నుంచి సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు 19 కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు తెలిపారు. భూదాన్ యజ్ఞ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ నిర్వహించిన సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు జరిగినట్లు తేలిందని ఆయన చెప్పారు. నిందితులు ఒక ముఠాగా ఏర్పడి తమను ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని ప్రచారం చేసి అమాయక ప్రజలను నమ్మబలికినట్లు పేర్కొన్నారు.

ఒక్కొక్కరి నుంచి భారీ వసూళ్లు

భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజలను ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ విధంగా అనేక మంది నిరుపేదలు మోసపోయారని చెప్పారు. వసూలు చేసిన డబ్బును నిందితులు తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే తమ వద్ద భూదాన్ పట్టాలు ఉన్నాయని, హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్పి బాధితులను నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ఇదే ముఠాపై గతంలో కూడా సుమారు 15 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

బాధితులకు ప్రభుత్వం అండ

వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. మోసపోయిన ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి తిరిగి బాధితులకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూదాన్ భూముల్లో అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఖమ్మం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్‌తో పాటు సత్తుపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరైనా మోసపోయినట్లు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కొప్పెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం, బల్లి శ్రీనివాసరావు, తాళ్లూరి కృష్ణ, ముదిగ రాములు, మంకిడి లింగరాజు, రాచకొండ నరసింహాచారి, దండా లింగయ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భూదాన్ భూముల పేరిట మోసం

భూదాన్ భూముల పేరిట మోసం అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు సత్తుపల్లి ఇన్స్పెక్టర్...

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహాయ ఉపకరణాలు, సబ్సిడీల...

సమాజ అభివృద్ధికి మహిళలే బలం

సమాజ అభివృద్ధికి మహిళలే బలం జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా అంతర్జాతీయ మహిళా...

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు

హత్యాయత్నం ఘటనలో ఐదుగురు అరెస్టు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని నెహ్రూ...

“మహానటి”

"మహానటి" ** ఆమె ఒక గొప్ప నటి… ఎందుకంటే ఆమె నటన ప్రాణాలతో రాసిన నాటకం ఆస్కార్ అవార్డ్స్ ఎన్ని...

సీఐటీయూలో చేరిన యువ కార్మికులు

సీఐటీయూలో చేరిన యువ కార్మికులు కాకతీయ, కొత్తగూడెం : కార్మికుల సమస్యల పరిష్కారం...

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకతీయ, కొత్తగూడెం :జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి...

పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి

పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి విద్యుత్ షాక్‌కు గురై నవీన్ మృతి మణుగూరు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img