epaper
Thursday, January 15, 2026
epaper

అధిక లాభాల మాయలో కోట్ల రూపాయల దోపిడి ముఠా అరెస్ట్..

అధిక లాభాల మాయలో కోట్ల రూపాయల దోపిడి ముఠా అరెస్ట్..

అధిక లాభం ఆశతో పెట్టుబడి పెడితే నష్ట పోవాల్సిందే.. పోలీసులు హెచ్చరిక..

కాకతీయ, వరంగల్ బ్యూరో :

జనగాం జిల్లా పాలకుర్తి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కోట్లలో ప్రజల డబ్బు మోసం చేసిన నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే.. ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య పేరుతో హెబ్సిబా అనే సంస్థను 2023లో ఏర్పాటు చేసి, 2024లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి చీటీ వ్యాపారం ప్రారంభించాడు. ముందుగా సభ్యుల నుంచి 6 వేల రూపాయలు వసూలు చేసి, కేవలం 300 రూపాయల విలువ గల వస్తువులను 2 వేల విలువగా చూపించి అందజేశాడు. మిగతా డబ్బును లాభం పేరుతో తిరిగి చెల్లిస్తానని నమ్మబలికాడు. ఈ ముఠా గ్రామాల వారీగా ఏజెంట్లను నియమించి, ఇప్పటి వరకు 28,493 సభ్యత్వాలు నమోదు చేసి, ఒక్కొక్కరికి 4 వేల రూపాయల చొప్పున వసూలు చేసి మొత్తం రూ. 11 కోట్ల 39 లక్షలు సేకరించింది. అందులో వస్తువుల పేరుతో కేవలం రూ. 4 కోట్ల 84 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్నవి..

రూ. 5,92,000 నగదు, 684.5 గ్రాముల బంగారు నాణాలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, సెల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మెషిన్, చెక్‌ బుక్స్, స్టాంపులు, పొలాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలు అలాగే నిందితులు వసూలు చేసిన డబ్బును వివిధ 17 బ్యాంకుల్లో జమ చేసినట్లు గుర్తించి, రూ. 5 కోట్ల 48 లక్షలు రూపాయలకు పైగా ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

అరెస్టైన నిందితులు..

ప్రస్తుతం పాలకుర్తి లో నివాసం ఉంటున్న, సూర్యాపేట జిల్లా కు చెందిన తెప్పాలి సైదులు,
మనుబోతుల రామకృష్ణ, పొడిల సురేష్‌కుమార్, పొడిల శ్రీధర్ లను పోలీస్ లు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిపై గతంలోనే పది కి పైగా మోసం కేసులు ఉన్నాయని. అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల డబ్బును దోచుకునే బోగస్ కంపెనీలకు బలి కావద్దని, పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు.

పలుసెక్షన్స్ లో కేసు నమోదు..

జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నం.216/2025 కింద మోసం కేసు కింద నమోదు అయింది. ఇందులో బీ ఎన్ ఎస్ చట్టంలోని సెక్షన్లు 318(4), 316(2), 316(5) r/w 61(2) తో పాటు, ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం–1978లోని సెక్షన్ 3, 4, 5 కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం–1999లోని సెక్షన్ 5ను కూడా అమలులోకి తెచ్చారు. ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు సేకరించి మోసం చేసిన వ్యక్తులపై ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ప్రతిభ కనబరిచిన అధికారులు..

ఈ ఆపరేషన్‌లో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ నర్సయ్య, మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ పవన్, పాలకుర్తి సిఐ జానకీరాం రెడ్డి, ఎస్‌ఐలు వంశీ కృష్ణ, దిలీప్ తదితరుల కృషిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img