epaper
Thursday, January 15, 2026
epaper

ఏసిబి అధికారి వేషం వేసి దందా..

న‌కిలీ ఏసీబీ అధికారి అరెస్టు
ప్ర‌ధాన నిందితుడి రాచంప‌ల్లి శ్రీనివాస్‌పై రెండు రాష్ట్రాల్లో 50 కేసులు
2002 నుంచి దొంగ‌త‌నాలు, చైన్ స్నాచింగ్‌, దోపిడీ కేసులు
కొన్నేళ్లుగా ఏసీబీ డీఎస్పీగా చెలామ‌ని అవుతూ అధికారుల‌కు బెదిరింపులు
కేసు నుంచి త‌ప్పించాలంటే డ‌బ్బులివ్వాల‌ని డిమాండ్‌
మొత్తం 9మందితో ముఠాగా ఏర్ప‌డి నేరాలు
వ‌రంగ‌ల్ ఆర్టీఏ అధికారి ఫిర్యాదుతో వ‌రంగ‌ల్ పోలీసుల వేట‌
ఎట్ట‌కేల‌కు చిక్కిన గ‌జ దొంగ‌.. ఆయ‌న‌తో పాటు మ‌రో న‌లుగురి అరెస్టు
బ‌య‌ట‌ప‌డిన 20 ఏళ్ల నేర చ‌రిత్ర‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఏసీబీ అధికారిగా చెలామ‌ణి అవుతూ.. అధికారుల నుంచి డ‌బ్బులు వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న రాంచ‌ప‌ల్లి శ్రీనివాస్‌తో పాటు మ‌రో న‌లుగురిని సోమ‌వారం వ‌రంగ‌ల్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ వ‌ల‌కు రాచంప‌ల్లి ముఠాలోని ఐదుగురు చిక్క‌గా.. మ‌రో న‌లుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను (45 సం., పుట్టపర్తి జిల్లా, ఆంధ్రప్రదేశ్). అతనితో కలిసి నవీన్ జేఆర్ (కర్ణాటక), మంగళ రవీందర్ (బెంగుళూరు), మురళి (బెంగుళూరు), ఎస్‌.ఎన్‌. ప్రసన్న (బెంగుళూరు) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సూర్యప్రకాశ్, తాటిమద్ది వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న సీనియర్ అధికారులను టార్గెట్ చేసుకుని, మీ మీద అవినీతి కేసు నమోదైంది, బయటపడాలంటే డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. ఏబీబీ డీఎస్పీగా చెలామ‌ణి అవుతూ బెదిరింపులకు పాల్పడేవాడ‌ని అన్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆర్టీఏలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డి నుంచి వివిధ మార్గాల్లో 10 లక్షల రూపాయలు దోచుకున్న‌ట్లు తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నికల్ సాక్ష్యాలను సేకరించి.. టెక్నాల‌జీ సాయంతో ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణలో రాచంప‌ల్లి శ్రీనివాస్ నేరాల‌న్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శ్రీనివాస్ నేర చరిత్ర 2002లో ద్విచక్ర వాహన దొంగతనాలతో ప్రారంభమైంద‌ని, ఆ తర్వాత నకిలీ పోలీస్ అధికారిగా రాయలసీమలో నేరాలకు పాల్పడి, దొంగల కుటుంబాలను బెదిరించి బంగారం, డబ్బు దోచుకోవడం వంటి కేసుల్లో పాల్గొన్న‌ట్లు తెలిపారు. మొత్తం 50కిపైగా కేసులు అతని పేరుతో నమైద‌న‌ట్లు తెలిపారు. జైలు శిక్షలు అనుభవించినా, బయటికి వచ్చిన తర్వాత మళ్లీ కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో 41 చైన్ స్నాచింగ్స్ కు పాల్పడిన‌ట్లు తెలిపారు. నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తిన తరువాత ఇప్పటివరకు 19 కేసులు, రూ. 50 లక్షలకు పైగా దోపిడీ చేశాడ‌ని తెలిపారు. తెలంగాణలో 9 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 కేసులు నమోదయ్యాయి. అందులో 8 కేసుల్లో అరెస్టయ్యాడు. 11 కేసుల్లో పోలీసులకు చిక్క‌కుండా తిరుగుతున్నాడు. దోచిన డబ్బును నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్, గోవా కాసినోలు, బెంగుళూరు-గోవా వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ ఎన్‌.శుభం ప్రకాష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్, ఇన్‌స్పెక్ట‌ర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఎస్‌ఐలు ఎస్‌. మహేష్, ఎం. సురేష్ లను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img