గాంధీ మార్గమే శాశ్వత బలం
మహాత్ముడి ఆశయాలతో కాంగ్రెస్ ముందుకు
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
గాంధీ వర్ధంతి సందర్భంగా హనుమకొండ డీసీసీ భవన్లో ఘన నివాళి
డీసీసీ భవన్లో కాంగ్రెస్ శ్రేణుల శ్రద్ధాంజలి
సర్వోదయ చరక సంఘటన్కు మీనాక్షి శ్రీకారం
స్వదేశీ–స్వావలంబనపై నేతలకు పిలుపు
కాకతీయ, హనుమకొండ : గాంధీజీ చూపిన స్వదేశీ మార్గమే దేశ ఆర్థిక బలోపేతానికి పునాది అని అన్నారు. స్వావలంబనతోనే సమాజం నిలదొక్కుకుంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ డీసీసీ భవన్కు వచ్చిన మీనాక్షి నటరాజన్ మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకంట్రాంరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ పాల్గొని గాంధీ ఆశయాల ప్రాముఖ్యతను వివరించారు. గాంధీ గారి సత్యం, అహింస, స్వదేశీ, సర్వోదయం వంటి సిద్ధాంతాలే నేటి సమాజానికి శాశ్వత దిశానిర్దేశకమని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గాంధీ మార్గమే దేశానికి నిజమైన బలమని, ఆ ఆశయాలతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. గాంధీజీ సిద్ధాంతాలు కేవలం పుస్తకాల్లో కాకుండా ఆచరణలోకి వచ్చినప్పుడే నిజమైన నివాళి అవుతాయని అన్నారు.

సర్వోదయ చరక సంఘటన్కు శ్రీకారం
గాంధీ ఆశయాలకు ప్రతీకగా డీసీసీ భవన్లో సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని మీనాక్షి నటరాజన్ ప్రారంభించారు. చరకం ద్వారా స్వావలంబన, స్వదేశీ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. దూది నుంచి నూలు వడకడం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక బలాన్ని పెంపొందిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలను విధానంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యూబ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు దుద్దిళ్ల శ్రీనుబాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాస్ రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్ రావు, జాతీయ కోఆర్డినేటర్ పులి అనిల్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


