epaper
Wednesday, January 21, 2026
epaper

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు
ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు
కోచ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవాలంటూ పోస్టులు

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : టాలెంటెడ్ ఆటగాళ్లు, ఎంతో అనుభవం ఉన్న సీనియర్లతో కళకళలాడే భారత జట్టుకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమ్ఇండియా ఊహించని రీతిలో ఘోరమైన ఓటములను చవిచూస్తోంది. మొన్న ఆదివారం ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోవడమే దీనికి నిదర్శనం. విరాట్ కోహ్లీ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. గంభీర్ హయాంలో భారత్ ఎదుర్కొన్న 5 చేదు జ్ఞాపకాలు అభిమానుల‌ను వెంటాడుతున్నాయి.

చరిత్రలోనే మొదటిసారి..

టీమ్ఇండియా చరిత్రలోనే న్యూజిలాండ్ జట్టు మన దేశానికి వచ్చి వన్డే సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. అంతకుముందు 1988 నుంచి 2023 వరకు కివీస్ టీమ్ భారత్‌లో ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే ఏడింటిలోనూ ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం వారు 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుని గంభీర్ కోచింగ్‌లో భారత్‌కు మొదటి దారుణమైన పరాభవాన్ని మిగిల్చారు. అసలు ఇలాంటి రీతిలో సిరీస్ చేజారుతుందని ఎవరూ ఊహించలేదు. జట్టు మంచి ఫామ్‌లో ఉన్నట్లు అనిపిస్తున్నా ఫలితం మాత్రం దారుణంగా ఉంటోంది.

టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్

నవంబర్ 2024లో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. కనీసం మూడు మ్యాచులు ఉన్న టెస్ట్ సిరీస్‌లో భారత్ తన సొంత గడ్డపై వైట్‌వాష్ అవ్వడం ఇదే తొలిసారి. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అవ్వడం కూడా గంభీర్ హయాంలోనే జరిగింది. టాప్ ప్లేయర్స్ అందరూ ఒకేసారి ఫామ్ కోల్పోవడం కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. బ్యాటింగ్ లైనప్‌లో క్లారిటీ లేకపోవడం ఈ పరాభవానికి ప్రధాన కారణమని కొందరు సీనియర్లు కామెంట్ చేశారు.

శ్రీలంకతో 27 ఏళ్ల తర్వాత సిరీస్ ఓటమి

ఆగస్టు 2024లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-0తో కోల్పోయింది. గత 27 ఏళ్లలో శ్రీలంక చేతిలో భారత్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు 1997లో శ్రీలంక చేతిలో ఓడిపోయిన భారత్, ఆ తర్వాత వరుసగా 13 సిరీస్‌లలో ఓటమి లేకుండా దూసుకుపోయింది. కానీ గంభీర్ రాకతో ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. శ్రీలంక ఇతర చిన్న జట్లతో ఓడిపోతున్న సమయంలో భారత్‌ను ఓడించడం పెద్ద షాక్ అనే చెప్పాలి. 2024-25 లో గంభీర్ కోచింగ్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ 3-1తో సిరీస్‌ను కోల్పోయి, పదేళ్ల తర్వాత ట్రోఫీని ప్రత్యర్థికి అప్పగించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌ ఈనెల 21లోపు తుది నిర్ణయాన్ని తెల‌పాలి లేదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్ ఐసీసీ...

ఆట‌కు వీడ్కోలు ప‌లికిన సైనా నెహ్వాల్

ఆట‌కు వీడ్కోలు ప‌లికిన సైనా నెహ్వాల్ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : భారత...

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్..

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్.. 45 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్...

గంభీర్.. నీకో దండం!

గంభీర్.. నీకో దండం! టీమిండియాను వదిలేయ్! భార‌త్ క్రికెట్ కోచ్‌పై ఫ్యాన్స్ ఫైర్ హెడ్ కోచ్...

ఫామ్​లోనే రోహిత్

ఫామ్​లోనే రోహిత్ ఒక్క సిరీస్ ప్రదర్శన ఆధారంగా విమ‌ర్శించ‌డం త‌గ‌దు హిట్​మ్యాన్​కు ​గిల్ మద్దతు కాక‌తీయ‌,...

ఫీల్డింగే ముంచింది

ఫీల్డింగే ముంచింది మిడిల్ ఓవర్లలో ఫీల్డర్ల ఉదాసీనత చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు బౌలర్లు సృష్టించిన...

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img