అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం
* 7వ వార్డు కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్
కాకతీయ,చేర్యాల: అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని 7వ వార్డు కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్ అన్నారు. బుధవారం తమ వార్డులోని 9వ అంగన్వాడి సెంటర్ లో మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వార్డ్ కౌన్సిలర్ ప్రసాద్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో చిన్నారుల అభివృద్ధి, గర్భిణీ స్త్రీల సంక్షేమంలో అంగన్వాడీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి తాను ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, విద్యా కార్యక్రమాలు ఇతర సంక్షేమ సదుపాయాలు నిజంగా అర్హులైన నిరుపేదలకు సక్రమంగా చేరేలా టీచర్లు కృషి చేయాలని కోరారు.విద్య ద్వారా సామాజిక అసమానతలు తొలగిపోతాయని, ఎవరు దోచుకోలేనిది విద్య మాత్రమేనని ప్రసాద్ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సేవలను మరింత మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కౌన్సిలర్ నూతనంగా ఎన్నికైన ప్రసాద్ ను అంగన్వాడి సిబ్బంది, కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలోజు ఆంజనేయులు, రంగోనీ శంకర్,మనమ్మ, పరిపూర్ణ, రజియా,భవాని,హారిక,భార్గవి,అంగన్వాడి ఆయ అనురాధ తదితరులు పాల్గొన్నారు


