జడ్పీ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి మృతి
అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
కాంగ్రెస్ పార్టీలో విషాదం.. ఉమ్మడి జిల్లాకు సేవలు
కాకతీయ, కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్పర్సన్గాన్ గోనెల విజయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె పాల్వంచలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి వార్త తెలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. గోనెల విజయలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన స్వర్గీయ గోనెల నారాయణ సతీమణి. ఆమె రాజకీయంగా కూడా చురుకుగా పనిచేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్పర్సన్గాన్ సేవలందించారు. గోనెల విజయలక్ష్మి అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆమె సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.


