epaper
Tuesday, January 20, 2026
epaper

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం
కరీంనగర్‌ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం
అభ్యర్థులు దొరకని పార్టీలే విమర్శలు చేస్తున్నాయి
బీఆర్ఎస్ క‌రీంన‌గ‌ర్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే నినాదంగా ప్రజల్లోకి వెళ్తామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకక రెండు పార్టీల నేతలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గెలిచే సత్తా ఉన్న నాయకులు లేక బీఆర్ఎస్ కార్యకర్తలకు కండువాలు కప్పి తమ పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డివిజన్ల వెంట కండువాలు పట్టుకుని తిరిగినా ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదన్నారు.

కండువా మార్చగానే గతం మర్చిపోయారా?

మాజీ మేయర్ సునీల్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన హరిశంకర్.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు బీజేపీ చేసిందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. కండువా మార్చగానే గతాన్ని మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. రెండేళ్లుగా నగరానికి నిధులు తీసుకురాని కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నగరానికి చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

గంగుల–వినోద్ కృషితోనే నగర సుందరీకరణ

మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషితోనే కరీంనగర్ నగరం సుందరంగా మారిందని హరిశంకర్ గుర్తుచేశారు. డంప్‌యార్డు తరలింపు వంటి ప్రధాన సమస్యలపై ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలను కూడా ఎత్తిచూపుతూ, కరీంనగర్ ప్రజలు విజ్ఞులని, అభివృద్ధికి పట్టం కడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, కచ్చు రవి, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు షౌకత్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బొంకూరి మోహన్, ఆరె రవి గౌడ్, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, జల్లోజి శ్రీనివాస్, సతినేని శ్రీనివాస్, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, పూరెల్ల సరోజ, ఒడ్నాల రాజు, సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు ఆశావ‌హుల మ‌ధ్య ఒప్పందం.....

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం సన్నాహాలు క్రిటికల్ కేంద్రాల్లో...

ప్రజల గుండెల్లో నిలిచే పనులే లక్ష్యం

ప్రజల గుండెల్లో నిలిచే పనులే లక్ష్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శాషామహల్‌లో...

కొండగట్టు వద్ద టవేరా బోల్తా.. 14 మందికి గాయాలు

కొండగట్టు వద్ద టవేరా బోల్తా.. 14 మందికి గాయాలు కాకతీయ, కరీంనగర్ :...

రంగనాయక గుట్టల్లో జాతర ఏర్పాట్లు ప్రారంభం

రంగనాయక గుట్టల్లో జాతర ఏర్పాట్లు ప్రారంభం సమ్మక్క–సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, హుజురాబాద్...

గణిత పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థికి టాప్ ర్యాంక్

గణిత పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థికి టాప్ ర్యాంక్ ఆర్యభట్ట గణిత ఛాలెంజ్‌లో టాప్–100లో...

కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు

కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు పార్టీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో...

పంథా మార్చిన ఇసుక మాఫియా

పంథా మార్చిన ఇసుక మాఫియా సంచుల్లో నింపి రవాణా.. పోలీసుల నిఘాకు చిక్కిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img