విద్యుత్ షాక్తో రైతు మృతి
బోరు మోటర్ ఆన్ చేస్తుండగా ఘటన
కాకతీయ, నెల్లికుదురు : విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకున్నట్లు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, బడి తండా గ్రామపంచాయతీ పరిధిలోని వరంబండ తండాకు చెందిన బిలావత్ పాప (45) ఆదివారం సాయంత్రం తన వరి పొలం వద్దకు వెళ్లాడు. బోరు మోటర్ స్టార్టర్ ఆన్ చేసే సమయంలో సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి తెగిపడిన కరెంటు లైన్ వైరు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య బిలావత్ కైక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


