epaper
Thursday, January 15, 2026
epaper

అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం

అసెంబ్లీకి దూరం… బయట రాజకీయం
సమావేశాల బీఆర్ ఎస్ బ‌హిష్క‌రించ‌డంపై భిన్న వాద‌న‌లు
‘ఒక అంశాన్ని సాకుగా చూపి సభ బాయ్‌కాట్ ఎందుకు?’
అసెంబ్లీలో ప్రశ్నించాల్సిన విషయాలు బయటే చర్చా?
కాంగ్రెస్–బీఆర్‌ఎస్ నేత‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు
నదీజలాలపై ఎవరి ప్రజెంటేషన్ వారిదే!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనసభ సమావేశాలను బీఆర్‌ఎస్ బహిష్కరించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్… సభలో వాకౌట్ చేసి పూర్తిస్థాయిలో బాయ్‌కాట్‌కు దిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ వాదన భిన్నంగా ఉంది. ఒకే అంశాన్ని సాకుగా చూపి మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మూసీ ప్రక్షాళన అంశంపై మైక్ ఇవ్వలేదన్న కారణాన్ని చూపిస్తూ సభకు దూరంగా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక అంశంపై మాట్లాడనివ్వలేదని చెబుతూ… మిగతా ప్రజా సమస్యలపై ఎందుకు చర్చించకూడదని కాంగ్రెస్ నిలదీస్తోంది. బీఆర్‌ఎస్ లొసుగులు బయటపడతాయన్న భయంతోనే అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటోందని ఆరోపిస్తోంది.

నదీజలాలపై రెండు వేదికలు

కృష్ణా జలాల వాటాపై రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండనున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ తరఫున హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో వేరు ప్రజెంటేషన్ ఇస్తారంటూ ప్రకటన చేశారు. నదీజలాల వంటి కీలక అంశంపై అసెంబ్లీ వేదికను వదిలేసి… ఎవరి వేదికల్లో వారు ప్రజెంటేషన్లు ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నదీజలాల అంశంపై రాజకీయ రగడ మొదలుపెట్టింది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నేనని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. అలాంటప్పుడు అదే అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించకుండా బయట రాజకీయాలు చేయడం ఏమిటని నిలదీస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ఆయనతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ సభకు రాకుండా బయట నుంచే పోరాటం చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తోంది.

‘సభలోనే ప్రశ్నించండి’

బయట ప్రశ్నించే అంశాలన్నింటినీ అసెంబ్లీలోనే ప్రశ్నిస్తే ప్రజలకు స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే సభలోనే నిలదీయాలని, అందుకు సిద్ధమేనని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కానీ అసెంబ్లీకి రావడానికి బీఆర్‌ఎస్ సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్యగా మారిందని వ్యాఖ్యానిస్తోంది. మొత్తానికి నదీజలాల అంశంపై ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారింది. శాసనసభ వేదిక ఖాళీగానే ఉండగా… రాజకీయ పోరాటం మాత్రం బయట ముదురుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img