epaper
Thursday, January 15, 2026
epaper

అంజనా టౌన్‌షిప్‌పై తప్పుడు కథనాలు

అంజనా టౌన్‌షిప్‌పై తప్పుడు కథనాలు
నిరాధార వార్తలపై చట్టపరమైన చర్యలు తప్పవు
రాజకీయ కక్షతోనే ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు
విచారణకు రాకుండా ఫిర్యాదుల పరంపర
ఒక్క గుంట తేలినా మున్సిపాలిటీకి అప్పగిస్తాం
జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వరరావు

కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని అంజనా టౌన్‌షిప్‌పై ఆధారాలు లేని ఆరోపణలతో నిరాధార వార్తలు రాస్తూ, ప్రసారం చేస్తున్న పత్రికలు, ఛానెళ్లపై చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేసినట్లు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు వ్యక్తులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, అంజనా టౌన్‌షిప్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల సహకారంతో లోకాయుక్తకు పలుమార్లు ఫిర్యాదులు చేస్తూ, విచారణకు మాత్రం హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు.

అన్ని అనుమతులతో లేఔట్

అంజనా టౌన్‌షిప్ జమ్మికుంట పట్టణానికి తలమానికంగా నిలిచిందని, అన్ని ప్రభుత్వ అనుమతులతోనే లేఔట్ చేయబడిన టౌన్‌షిప్ అని స్పష్టం చేశారు. రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందంటూ అధికారులు వద్దకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారుల విచారణలో అలాంటి కబ్జా జరగలేదని తేలిందన్నారు. విచారణలో క్లియర్ అయినా అదే అంశాన్ని పదే పదే పునరావృతం చేస్తూ, టౌన్‌షిప్‌లో నివసిస్తున్న సామాన్య కుటుంబాలను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిరాధార ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఒకవేళ ఒక్క గుంట ప్రభుత్వ భూమి కబ్జా అయినట్టు తేలినా, ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందంటూ తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదని అన్నారు. నిరాధార వార్తలు ప్రచురించిన పత్రికలు, ఛానెళ్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంజనా టౌన్‌షిప్‌కు సంబంధించిన అన్ని ప్రభుత్వ అనుమతి పత్రాలు, తప్పుడు కథనాల పత్రిక కటింగ్స్‌ను మీడియాకు చూపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img