epaper
Thursday, January 15, 2026
epaper

లంబాడీలపై అసత్య ప్రచారం సరికాదు..!!

కాకతీయ, గీసుగొండ: లంబాడీలు గిరిజనులు కాదని వారిని గిరిజన జాబితా నుంచి తొలగించాలని చేస్తున్న అసత్య ప్రచారం సరికాదని బంజారా నాయకులు మండిపడ్డారు. మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మి నరసింహ స్వామి మినీ ఫంక్షన్ హల్‌లో శుక్రవారం రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో బానోత్ రాఘవేంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా.. బానోత్ రాఘవేంద్ర మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే దేశ మూల నివాసులని, స్వాతంత్ర్యం రాకముందే గిరిజనులుగా గుర్తింపు పొందామని తెలిపారు. 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చినా, 1931లో నిజాం ప్రభుత్వం చేపట్టిన కులగణనలో గిరిజనులుగా గుర్తింపు పొందామని ఆయన గుర్తు చేశారు.

కేలోత్ స్వామి మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో లంబాడిలు గిరిజన జాబితాలో చేర్చబడ్డారని వివరించారు. రేవంత్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడిలను కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల పాటు గిరిజన జాబితాలో చేర్చకపోవడం ఘోరమైన అన్యాయం అని ఆరోపించారు.

అనంతరం 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం ద్వారా తెలంగాణ ప్రాంత లంబాడిలకు గిరిజన హోదా కల్పించిందని తెలిపారు.ఇక ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలంటూ పిటిషన్ వేశారని,ఇది లంబాడి సమాజానికి ద్రోహమని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ చర్య కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమేనా అనే ప్రశ్న లంబాడి సమాజంలో తలెత్తిందని నాయకులు వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లంబాడిలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బోడ హరి నాయక్ మాట్లాడుతూ లంబాడిల గిరిజన హోదాను కాపాడే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.

ఈ అంశంపై బీఆర్‌ఎస్, బీజేపీ తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య నిమ్మ నాయక్, వాంకుడోత్ తిరుపతి, కేలోతు బిక్షపతి, బాధావత్ కృష్ణ, మోతిలాల్, ఆంగోత్ స్వామి, బాదావత్ గణేష్, భూక్య సింహాద్రి రాజేందర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img