ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
రాజకీయ పార్టీలు సహకరించాలి
రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పురపాలక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, ఎన్నికల ఖర్చుల నియంత్రణపై చర్చించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రేట్ చార్ట్ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఒక్కో పార్టీ అభ్యర్థి లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని సూచించారు. అలాగే చేసిన ప్రతి ఖర్చును లెక్కల రూపంలో నమోదు చేసి, సంబంధిత అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ, డీపీవో కల్పన, బీఎస్పీ పార్టీ నుండి హరిశంకర్, వైఎస్సార్సీపీ నుండి రజినీకాంత్, బీఎస్పీ నుండి అనిల్ కుమార్, ఏఐఎంఐఎం నుంచి సయ్యద్ ఫైజుల్లా తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


