epaper
Tuesday, March 10, 2026
epaper

విద్య–వైద్య రంగాలకే ప్రథమ ప్రాధాన్యం

విద్య–వైద్య రంగాలకే ప్రథమ ప్రాధాన్యం
ఆసుపత్రుల పరిశుభ్రంగా ఉంచాలి
ఖమ్మం నగర జీవన ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి
త్వరలో మరో 2,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల
బాలాజీ నగర్ అర్బన్ పీహెచ్‌సీ ప్రారంభం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగర 4వ డివిజన్ బాలాజీ నగర్‌లో రూ.2.43 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలతో వైద్య సిబ్బంది ప్రేమాభిమానాలతో వ్యవహరించాలని సూచించారు. వైద్య సిబ్బంది మంచి ప్రవర్తనతోనే రోగి బాధ సగం నయమవుతుందని వ్యాఖ్యానించారు.
ఆసుపత్రి పరిసరాల్లో పచ్చని మొక్కలు పెంచి, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్య శాఖకు కేటాయించిన నిధులతో పాటు అవసరమైతే కలెక్టర్‌, కమిషనర్‌ ద్వారా అదనపు నిధులు సమకూర్చి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

అవసరమైతే ప్రత్యేక నిధులు

ఆసుపత్రి అవసరాలకు అవసరమైతే ప్రజాప్రతినిధులు, మంత్రుల ద్వారా ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న సిబ్బందిని అర్బన్ హెల్త్ సెంటర్లకు వినియోగించుకోవాలని, కొత్త పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపితే చర్చించి ఆమోదింపజేస్తానన్నారు. మంచి విద్య, మెరుగైన వైద్య సదుపాయాలతో ఖమ్మాన్ని ప్రశాంత నగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య–వైద్య రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు 2,200 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, త్వరలో మరో 2,500 ఇండ్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. రూ.13 వేల కోట్లతో రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో 6,000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశానని, పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసి నిర్వాసిత పేదలకు కేటాయించామని తెలిపారు.
ఖమ్మం మార్కెట్ ప్రాంతంలో రోడ్డుపై నివసిస్తున్న 28 పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి రోడ్డు విస్తరణ చేపట్టామని మంత్రి తెలిపారు. రోడ్డు విస్తరణలో ఎవరికైనా భవనాలు కోల్పోతే పది రెట్ల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో అక్రమ గుడిసెలు వేయడానికి అధికారులు అనుమతించవద్దని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… రూ.2.43 కోట్లతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కేంద్రం ద్వారా డివిజన్ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. చిన్న చిన్న జ్వరాలు, రక్త పరీక్షల కోసం జనరల్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని, హెల్త్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. గర్భిణీలకు 100 శాతం ఏఎన్‌సీ చెకప్‌లు, ప్రసవాలు, శిశువులకు టీకాలు ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రామారావు, కార్పొరేటర్ డి. జ్యోతి రెడ్డి, ఆర్డీవో నర్సింహారావు, మునిసిపల్ ఈఈ కృష్ణలాల్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

పోడు భూమిలో కందకాలు..

పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ...

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి

మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400...

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..! పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం బాధితుల బాధను రాజకీయ...

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..!

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..! కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం కాకతీయ, కారేపల్లి...

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..!

సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..! అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు...

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!

గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..! పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img