డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా డాక్టర్ జేఏసీ ఆందోళన
కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డ్ ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని మెడికల్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. హుజురాబాద్లో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు 12వ రోజుకు చేరుకున్నాయి. అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించిన నిరసనలో ప్రైవేట్ ఆసుపత్రులు, ఆర్ఎంపీలు, మెడికల్ షాపుల ప్రతినిధులు పాల్గొన్నారు.డంపింగ్ యార్డ్ వల్ల వాయు, జల కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో వ్యాధులు విస్తరించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని జేఏసీ నాయకులు కొండల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రత్నం, రామారావు, వెంకట్రావు, సమ్మయ్య, పాపిరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.


