epaper
Thursday, January 15, 2026
epaper

వల్లకాడును వదలరే!

వల్లకాడును వదలరే!
మట్టెవాడలో శ్మశాన వాటికలో కబ్జాపర్వం
ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చిన జీడబ్ల్యూఎంసీ అధికారులు
డిప్యూటీ చైర్మన్ బండా, ఎమ్మెల్సీ బస్వరాజు లేఖలతో వెలుగులోకి
వరంగల్ బల్దియాలో అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో ప్రభుత్వ భూముల కబ్జాపర్వానికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలు, రహదారులు, మురికి కాల్వలు, నాలాలు, చెరువు శిఖం భూములు మాత్రమే కాదు… చివరకు శ్మశానవాటికలను కూడా కబ్జాదారులు వదలడం లేదు. ఈ అక్రమాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖ, వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) అధికారులే అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ప్రతి సోమవారం జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు వస్తున్న ఫిర్యాదులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజాగా నగరంలో శ్మశానవాటిక కబ్జాకు గురికావడం… అధికారుల విధుల నిర్వహణలో నిబద్ధతకు నిలువెత్తు ప్రశ్నగా మారింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు వేర్వేరుగా బల్దియా కమిషనర్‌కు రాసిన లేఖలతో ఈ కబ్జా బండారం వెలుగులోకి వచ్చింది.

వల్లకాడులో ఇంటికి అనుమతులా?

వరంగల్ మట్టెవాడ ప్రాంతం సర్వే నంబర్ 442లో శ్మశానవాటిక ఉన్నట్లు అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఈ భూమిలో సుమారు 13 గుంటల స్థలాన్ని తొలుత కబ్జా చేసినట్లు సమాచారం. నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసిన గుత్తికొండ తిరుపతి… ఆ స్థలాన్ని కరీంనగర్‌కు చెందిన ఏ. దామోదర్, శారద దంపతులకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దామోదర్ ఇటీవల ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బల్దియా అధికారులపై నమ్మకం కోల్పోయిన స్థానికులు… చివరకు డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలను ఆశ్రయించారు. వారు వెంటనే స్పందించి శ్మశానవాటికలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి తగు చర్యలు తీసుకోవాలంటూ జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌, వరంగల్ తహసీల్దార్‌కు లేఖలు రాశారు.

అధికారులనే అదరగొట్టిన కబ్జాదారులు!

ప్రజాప్రతినిధుల లేఖలతో బల్దియా కమిషనర్‌, తహసీల్దార్ అప్రమత్తమయ్యారు. తక్షణమే జీడబ్ల్యూఎంసీ టౌన్‌ప్లానింగ్‌, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ శాఖ ఆర్‌ఐలను సంఘటన స్థలానికి పంపించారు. అయితే ఇంటి నిర్మాణదారుడు అధికారులనే అదరగొట్టినట్లు సమాచారం. తన వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని, జీడబ్ల్యూఎంసీ అధికారులు స్వయంగా పరిశీలించి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వాదిస్తూ అధికారులను హడలెత్తించినట్లు తెలుస్తోంది. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని, సర్వే పూర్తయ్యే వరకు పనులు నిలిపివేయాలని చెప్పి టౌన్‌ప్లానింగ్ అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చిన పరిస్థితి. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువు శిఖం భూముల పరిరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఇది మరో నిలువెత్తు సాక్ష్యంగా మారింది. శ్మశానవాటిక కబ్జా బాగోతం ఇక ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img