epaper
Thursday, January 15, 2026
epaper

దేవుళ్ల పేరుతో రాజకీయం చేయొద్దు: మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: పూజారుల అంగీకారంతోనే మేడారం గద్దెల ప్రాంతంలో మార్పులు చేపట్టనున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజన గోత్రాలు, పూజా ఆచారాల ప్రకారం అమ్మవార్ల పూజారుల అంగీకారం పూర్తయిన అనంతరమే గద్దెల ప్రాంతంలో మార్పులు చేపడతామని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో డీ.పి.ఆర్. సిద్ధమైన తర్వాత ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేయకూడదని, భక్తుల విశ్వాసం దెబ్బ తినకుండా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.

మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి మాట్లాడారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పలు గ్రామాల గుండా రోడ్డు విస్తరణ, డైవర్షన్ రోడ్ల ఏర్పాటు జరుగుతోందని సీతక్క వివరించారు. గత జాతర సందర్భంగా రైతులకు నష్టపరిహారం అందజేశామని, ఈసారి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ములుగు జిల్లా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతంగా నిలిచిందని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ, దట్టమైన అడవులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని సీతక్క చెప్పారు. గద్దెల ప్రాంతంలో చిన్న గద్దెలను మాత్రమే కొంత మార్పిడి చేసే అవకాశం ఉందని, గద్దెలపై రాజకీయం మానుకోవాలని ఆమె సూచించారు.

ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన 41 మంది రైతులకు నష్టపరిహారం అందజేశారు. ఏకో పార్క్ సమీపంలోని ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ పట్టాలు అందజేశారు. మేడారం ప్రాంతంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఎంపీ బలరాం నాయక్ మంత్రి సీతక్కను కోరారు.

సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎంపీ బలరాం నాయక్ చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img