epaper
Thursday, March 5, 2026
epaper

ఆల‌స్యం చేయొద్దు

ఆల‌స్యం చేయొద్దు

ప‌నుల్లో వేగంపెంచాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి

కలెక్టర్ గరిమ అగ్రవాల్

కాకతీయ, సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం పట్టణంలోని నాలుగో వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస తమ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గృహప్రవేశానికి అనువుగా ఇళ్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించిన కలెక్టర్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు నిర్మాణాల ఫోటోలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో హౌసింగ్ పీడీ సాజిద్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థుల హాజరు, పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పించిన వసతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస కాంగ్రెస్ పార్టీలో...

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి భ‌ద్రాద్రి...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల...

రేషన్ డీలర్‌పై కేసు నమోదు

రేషన్ డీలర్‌పై కేసు నమోదు తనిఖీలో 60 క్వింటాళ్లకు పైగా నిల్వ తేడా...

మార్చి 16న చలో కలెక్టరేట్

మార్చి 16న చలో కలెక్టరేట్ లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడి కార్మికుల...

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు రెండు లక్షల జరిమానా...

ప‌దో త‌ర‌గ‌తిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం

ప‌దో త‌ర‌గ‌తిలో వంద శాతం ఫలితాలు లక్ష్యం భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు...

గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి

గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img