మసీదుకు సామగ్రి అందజేత
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ వనపర్తి మల్లయ్య తన తల్లిదండ్రులు వనపర్తి మల్లమ్మ, రాజయ్య జ్ఞాపకార్థంగా స్థానిక మసీదుకు వంటశాలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. మసీదుల్లో ఇఫ్తార్ విందులు, సామూహిక వంటలు నిర్వహించేందుకు ఉపయోగపడే పెద్ద పాత్రలు, గరిటెలు తదితర వంట సామాగ్రిని సమకూర్చారు. ఈ సందర్భంగా వనపర్తి మల్లయ్య మాట్లాడుతూ… రంజాన్తో పాటు ఇతర పండుగల సమయంలో మసీదుల వద్ద ఇలాంటి వంట ఏర్పాట్లు ముస్లిం సోదరుల ఐక్యతను మరింత బలపరుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత రమేష్, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు బసవయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ చింతం కుమారస్వామి, ప్రజా ప్రతినిధులు అశోక్, అనిల్, హరీశ్, ప్రసాద్, దామోదర్, దాశి, రాజయ్య, మల్లేశం, తిరుపతి, భూమయ్య, స్వామి, శంకరయ్య, భిక్షపతి పాల్గొన్నారు.


