epaper
Monday, March 2, 2026
epaper

మాతోనే ఆట‌లా ?

  • కేంద్రం నా బెంచ్‌ను త‌ప్పించాల‌ని చూస్తోంది
  • సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మరో 20 రోజుల్లోనే ముగియ‌నున్న పదవీకాలం
  • రిటైర్మెంట్ వేళ సీజేఐకి కేంద్రం షాక్ !

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా మరో 20 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఓ అనూహ్య పరిణామం ఎదురైంది. సుప్రీంకోర్టులో దాఖలైన ఓ కీలక పిటిషన్ విషయంలో కేంద్రం చేసిన విజ్ఞప్తి ఆయనకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం సుప్రీంకోర్టుతో ఆటలాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ తాజాగా కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్ధించింది. అయితే ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. తీర్పు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ట్రైబ్యునల్ రిఫామ్స్ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ కొనసాగుతోన్న మధ్యలో కేంద్రం అభ్యర్థించడం గమనార్హం. నవంబరు 3న సోమవారం పిటిషనర్ల వాదనలు పూర్తయ్యాక, అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో పాల్గొనడానికి వీలుగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోరడంతో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో ఐదుగురు జడ్జిల బెంచ్‌కు బదిలీ చేయాలని ఏజీ అభ్యర్థించారు. దీంతో షాకైన న్యాయమూర్తులు.. ‘ప్రస్తుత బెంచ్‌ను తప్పించుకోవాలనే రీతిలో కేంద్రం ఉన్నట్టుంది’ అని వ్యాఖ్యానించారు.

ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని ఊహించలేదు

‘‘కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంభిస్తుందని, న్యాయస్థానంతో ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని మేము ఊహించలేదు..’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో 20 రోజుల్లోనే జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ‘‘మేము పిటిషనర్ల తరఫు లాయర్ల వాదనలు పూర్తిస్థాయిలో విన్నాం.. వాదనలు పూర్తయిన తరువాత ఏ ఒక్కసారి కూడా అటార్నీ జనరల్ ‘కేంద్ర ప్రభుత్వం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ అంశం రిఫర్‌ చేయమందని కోరలేదు’’ అని పేర్కొన్నారు. ‘కానీ, మేము ఈ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం.. అలాగే, ప్రస్తుత ధర్మాసనాన్ని కేంద్రం తప్పించుకునే ఉద్దేశంలో ఉంది ఎందుకంటే మరికొద్ది రోజుల్లో సీజేఐ పదవీకాలం ముగియనుంది’ అని జస్టిస్ గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img