న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం…
– అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు
– మెరిట్ ఆధారంగా ఎంపిక చేయలేదని బాధితురాలి ఆవేదన
కాకతీయ, దుగ్గొండి: ప్రీ ప్రైమేరీ ఇన్స్ట్రక్టర్ ఎంపికలో అన్ని అర్హతలు ఉన్న అధికారులు తనకు అన్యాయం చేశారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఒత్తిడితో వేరే వ్యక్తికి అట్టి పోస్టును కేటాయించిరని బాధితురాలు వాపోయింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ లో పిర్యాదు చేసిన కూడా పట్టింపు లేదని బాధితురాలు తన గోడును వెలపోసుకుంది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన బొగ్గుల పవిత్ర అనే యువతి గ్రామంలోని ప్రీ ప్రైమరీ స్కూల్ లో ఇన్స్ట్రక్టర్ పోస్టు కోసం దరఖాస్తూ చేసుకుంది. అయితే నిబంధనల ప్రకారంగా ప్రైమేరీ స్కూల్ గ్రామంలో ఏ వార్డులో అయితే ఉందొ అదే వార్డుకు సంబందించిన వారికి మెరిట్ ఆధారంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి పోస్టుకు ఎంపిక చేయవలసి ఉంటుంది. అధికారులు తనకు అన్యాయం చేసి అట్టి నిబంధనలను తుంగలో తొక్కి అదే గ్రామంలో రెండవ వార్డుకు సంబంధించిన వేరే వ్యక్తికి పోస్టును కేంటాయించినట్లు పవిత్ర తెలిపారు.
అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు… అక్కడంటే ఇక్కడ.. ఇక్కడంటే అక్కడ…
అన్ని అర్హతలున్న తనకు రావలసిన ఉద్యోగాన్ని వేరే వాళ్లకు కేటాయించడంతో సంబంధిత అధికారులు జిల్లా విద్యా శాఖ అధికారి, మండల విద్యా వనరుల అధికారి, గ్రీవెన్స్ సెల్ లో దరఖాస్తూ చేసిన తనకు న్యాయం జరగడం లేదని అధికారులు వాళ్ళు చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి మాదగ్గర ఎలాంటి తప్పు జరగలేదు అనే దాటావేత ధోరణితో ఎంఈఓ ఆఫీస్ కు వెలితే డిఈఓ ఆఫీస్ వెళ్ళమని అక్కడంటే ఇక్కడ ఇక్కడంటే అక్కడే అని ఆఫీస్ ల చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తునట్లు భాధితురాలు తెలిపింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సత్య శారద ను కలవగా మండల పరిషత్ అభివృద్ది అధికారిని పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలను కలెక్టర్ తెలిపినట్లు సమాచారం.
మండలంలో దరఖాస్తు ప్రక్రియ మాత్రమే… ఎంపిక జిల్లా అధికారులదే…
మండల విద్యా శాఖ అధికారి – వెంకటేశ్వర్లు
ఇట్టి విషయమై మండల విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లును చరవాణి ద్వారా సంప్రదించగా దరఖాస్తూ ప్రక్రియ మాత్రమే తమ వద్దు జరిగిందని ఎంపిక ప్రక్రియ జిల్లా విద్యా శాఖ అధికారి, కలెక్టర్ సంబంధిత అధికారులు చూసుకున్నారని తెలిపారు.


