కాకతీయ, మహబూబాబాద్: గార్ల,డోర్నకల్ మండలాలలో యూరియా పంపిణీ ప్రక్రియ, కేజీబివి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లను, కేజిబివి పాఠశాలలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ లు నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న యూరియా పంపిణీ సరఫరా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అధికారి అంకితభావంతో పనిచేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం యూరియా సరఫరా చేస్తూ వచ్చే యూరియా కు సంబంధించి ముందస్తు సమాచారం ఇస్తూ, పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నారని, అన్నారు.
గార్ల ప్రాథమిక సహకార గార్ల సొసైటీ సబ్ సెంటర్ ములకనూరు, (222), ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని, కేజిబివి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. డోర్నకల్ మండలం గొల్లచర్ల ప్రాథమిక సహకార సొసైటీ లో (333) బస్తాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు త్రాగునీరు, టెంట్లు, సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు.
గార్ల కేజీబీవీనీ సందర్శించి తరగతి గదులను, పరిసరాలను, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, లను పరిశీలించారు, పిల్లలకు అందించే డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని, సబ్జెక్టుల వారిగా విద్యాబోధనను అందించి, ఉత్తమ విద్యార్థిని, విద్యార్థులుగా తీర్చిదిద్దాలని, అన్నారు .షెడ్యూల్ ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
గార్ల, డోర్నకల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో సబ్ సెంటర్ పరిధిలో సిద్ధంగా ఉండాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాత శిశు మరణాలు జరగకుండా ముందస్తు, చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, సిబ్బంది హాజరు వివరాల రిజిస్టర్ లను తనిఖీ చేశారు. పాఠశాలలు, హాస్పిటల్స్ పరిసరాలను ఎప్పటికప్పుడు సానిటేషన్ నిర్వహిస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, లపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
రైతులకు యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి వచ్చే యూరియాను పోలీస్, వ్యవసాయ సహకార అన్ని విభాగాల సిబ్బందితో కలిసి పారదర్శకంగా వేగంగా సరఫరా చేయడం జరుగుతుందని రైతులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రత్యేక అధికారులు డిపిఓ హరిప్రసాద్, నరసింహ మూర్తి, స్థానిక తహసీల్దారులు శారద, ఇమ్మానియేల్, ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు ఏఓ రామారావు, మురళీ మోహన్, తదితరులు ఉన్నారు.


