బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ
కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలకేంద్రం మానసపల్లికి చెందిన జగజాంపుల పూలమ్మ గతవారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జాడి రామరాజు నేత స్పందించి వెంటనే పూలమ్మ కుటుంబసభ్యులకు ఆపన్నహస్తం అందించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గడ్డం సత్యం ఆధ్వర్యంలో పరామర్శించి 25 కేజీ ల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులతోపాటు గ్రామపెద్దలు, బీజేపీ నాయకులు జనగాం ఆనంద్, పాగే సమ్మయ్య, పాగే మల్లయ్య, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


