epaper
Wednesday, March 4, 2026
epaper

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు
15 మంది అరెస్టు… మరో 9 మంది పరారీ
రూ.63.19 లక్షల నగదు, కోట్ల ఆస్తులు స్వాధీనం
జనగామ–యాదాద్రిలో భారీగా రిజిస్ట్రేషన్ల‌ మోసం
నకిలీ చలాన్లతో 1,080 రిజిస్ట్రేషన్లు
రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
22 కేసులు నమోదు… వివ‌రాలు వెల్ల‌డించిన క‌మిష‌న‌ర్ స‌న్‌ప్రీత్‌సింగ్‌

కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టిన కుంభకోణాన్ని జనగామ పోలీసులు బట్టబయలు చేశారు. జనగామ, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో రూ.3.90 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయాన్ని కాజేసిన ముఠాకు చెందిన 15 మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ముఠా సభ్యుల వద్ద నుంచి పోలీసులు రూ.63.19 లక్షల నగదు, బ్యాంకులో ఉన్న రూ.1 లక్ష, సుమారు రూ.1 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పసునూరి బసవ రాజు (32), జెల్లా పాండు (46), మహేశ్వరం గణేష్ కుమార్ (39), ఈగజులపాటి శ్రీనాథ్ (35), యెనగంధుల వెంకటేష్, కోదురి శ్రావణ్ (35), కొలిపాక సతీష్ కుమార్ (36), తడూరి రంజిత్ కుమార్ (39), దుంపల కిషన్ రెడ్డి (29), దశరథ్ మేఘావత్ (28), నారా భాను ప్రసాద్ (30), గొపగాను శ్రీనాథ్ (32), శివ కుమార్ (33), ఒగ్గు కర్నాకర్ (42), అలేటి నాగరాజు (32) ఉన్నారు. వీరంతా జనగామ, యాదాద్రి జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ఇలా సాగిన మోసాల బాట…

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్ర‌వారం హ‌న్మ‌కొండ‌లోని క‌మిష‌న‌రేట్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రధాన నిందితులైన పసునూరి బసవ రాజు, జెల్లా పాండు యాదగిరిగుట్ట ప్రాంతంలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లు నిర్వహించేవారు. గణేష్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, రైతుల నుంచి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డబ్బును మీసేవ, ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా వసూలు చేసేవాడు. ఆ మొత్తంలో కొంత భాగాన్ని కమిషన్లుగా మద్యవర్తులకు ఇచ్చి, మిగిలిన డబ్బును ప్రధాన నిందితులకు పంపేవాడు. బసవ రాజు ధరణి, భూభారతి వెబ్‌సైట్‌లోని “ఇన్‌స్పెక్ట్ – ఎడిట్ అప్లికేషన్”ను దుర్వినియోగం చేసి, చెల్లించాల్సిన చలాన్ మొత్తాన్ని తగ్గించేవాడు. ఆ తర్వాత మొబైల్ యాప్‌ల సహాయంతో నకిలీ చలాన్లు తయారు చేసి రైతులకు పంపించేవారు. చెల్లించాల్సిన రుసుముకన్నా తక్కువగా మార్పు చేసిన చలాన్లను మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగిలిన మొత్తాన్ని జేబుల్లో వేసుకునేవారు.

1,080 రిజిస్ట్రేషన్లలో మోసం

ఈ నకిలీ చలాన్లను స్థానిక ఎమ్మార్వో, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మొత్తం 1,080 రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించి మోసాలు జరిగినట్లు తేలింది. ఈ కుంభకోణంపై మొత్తం 22 కేసులు నమోదు కాగా, వాటిలో జనగామ జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 15 కేసులు ఉన్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా మీ సేవ, ఆన్‌లైన్ సర్వీసులు, మద్యవర్తుల వద్దకు రావాల్సిన ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ పత్రాలను తమ వద్దకే తీసుకుని నమోదు చేసేదని పోలీసులు తెలిపారు. ప్రతి రిజిస్ట్రేషన్‌లో 10 నుంచి 30 శాతం వరకు కమిషన్లుగా పంచుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఈ భారీ స్కామ్‌ను ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఎస్‌ఐలు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరలో ప్రభల హోరు..

కొమ్మాల జాతరలో ప్రభల హోరు.. జాత‌ర‌లో రాజకీయ ఆధిప‌త్య‌ రంగు..! భక్తులతో కిటకిటలాడిన జాతర...

పోడు భూములకు పట్టాలివ్వాలి

పోడు భూములకు పట్టాలివ్వాలి తుడుం దెబ్బ డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : పోడు భూములకు...

డ్రైవర్ల పోరాటానికి ఫలితం

డ్రైవర్ల పోరాటానికి ఫలితం జీతభత్యాలపై చ‌ర్చ‌లు స‌ఫ‌లం నూతన వేతనాల ఒప్పందం ఖరారు కాకతీయ, నర్సంపేట...

నాగలక్ష్మి ఆలయంలో చోరీ

నాగలక్ష్మి ఆలయంలో చోరీ విగ్ర‌హాలు విలువైన సామాగ్రి అప‌హ‌ర‌ణ‌ ఆకులవారి ఘనపురంలో ఘ‌ట‌న‌ గ్రామంలో...

అడవులను ర‌క్షించాలి

అడవులను ర‌క్షించాలి వ‌న్య‌ప్రాణులను కాపాడుకోవాలి ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు...

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం వాగులో విష్ణుమూర్తి పొలిక‌ల‌తో ఉన్న విగ్ర‌హం ల‌భ్యం వేల ఏళ్ల...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం..

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం.. స్వామివారికి హోలీ ప్రత్యేక పూజలు.. కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img