epaper
Saturday, January 17, 2026
epaper

నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు…

నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు…
మేడారం పనులపై తీవ్ర విమర్శలు…
ప్రభుత్వానికి బీఆర్ఎస్ హెచ్చరిక….
బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు

కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లలో జరుగుతున్న పనుల్లో నాసిరకం, అవ్యవస్థ, సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఏటూర్ నాగారం కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, అలాగే మంత్రి సీతక్కపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతర ప్రాంతంలో వాడుతున్న మెటీరియల్ పూర్తిగా నాణ్యత లేనిదని, ఫ్లోరింగ్‌కు మట్టి కలిసిన ఇసుక వాడుతున్నారని ఆరోపించారు. అక్కడ గ్యాప్‌లు, లెవెల్ మిస్‌మ్యాచ్ స్పష్టంగా కనిపిస్తాయని, భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లు లేకపోవడం, చెత్త కుప్పలు పేరుకుపోవడం, ఎంట్రన్స్ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారిపోవడం వల్ల భక్తులు అయోమయంలో పడుతున్నారని తెలిపారు. కోట్లాది మంది వచ్చే జాతరలో కనీస వసతులు కూడా సక్రమంగా లేవని విమర్శించారు. తొందరపడి పనులు చేయడం వల్ల క్వాలిటీపై దృష్టి పెట్టడం లేదని, దీని వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని అన్నారు. జాతరలో తల్లులకు సమర్పించిన బెల్లం భక్తులకు అందకుండా మధ్యలో దళారుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క ప్రత్యేకంగా దృష్టి పెట్టి దళారుల వ్యవస్థను తొలగించాలని కోరారు.ఎన్నికల ముందు సమ్మక్క తల్లి మీద ప్రమాణం చేసి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రైతులకు సాయం ఇప్పటికీ అందలేదని, వడగండ్ల వానకు పంట నష్టపోయిన ములుగు జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టే ముందు రైతులకు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 4000 పెన్షన్ హామీ కూడా అమలు కాలేదని, ప్రజల్లో దీనిపై తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించకపోతే ప్రభుత్వానికి ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. మేడారం అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఆధునీకరణకు మద్దతు ఇస్తామని, కానీ ప్లానింగ్ లేకుండా, ఆలస్యంగా, నాసిరకంగా చేస్తున్న పనులను మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. క్యాబినెట్ మీటింగ్ పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని, అసలు భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జనసంద్రంగా మేడారం!

జనసంద్రంగా మేడారం! ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక...

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఐనవోలు మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రజల...

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం

క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం యువతకు క్రమశిక్షణ, ఐక్యతను నేర్పే క్రీడలు సంక్రాంతి సందర్భంగా...

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు

సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహం నింపిన క్రీడలు కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొండాపురం...

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ ఆర్టీసీ డ్రైవర్ల భుజాలపైనే వేలాది మంది భద్రత ‘ఆరైవ్‌.....

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం దేవుని గుట్టపై భక్తుల సందడి కాకతీయ, నెల్లికుదురు...

మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్!

మేడారంలో పోలీస్ రెడ్‌కార్పెట్! సామాన్య భక్తులపై మాత్రం కఠినత్వం వృద్ధులు–వికలాంగుల్ని పట్టించుకోని వైఖరి పోలీస్ కుటుంబాలకు...

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు

ధరణి–భూభారతి స్కామ్‌ గుట్టు రట్టు 15 మంది అరెస్టు… మరో 9 మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img