epaper
Thursday, January 15, 2026
epaper

కేంద్రం నిధుల‌తోనే వ‌రంగ‌ల్‌లో అభివృద్ధి

కేంద్రం నిధుల‌తోనే వ‌రంగ‌ల్‌లో అభివృద్ధి
కేఎంసీలో హాస్పిటల్, ట్రైబల్ వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ కేంద్రం స‌హ‌కారంతోనే
డబుల్ ఇంజిన్ స‌ర్కారు వ‌స్తేనే రాష్ట్రంలో అద్భుత ప్ర‌గ‌తి
అన్నింటా రేవంత్ స‌ర్కారు విఫ‌లం.. భూముల అమ్మక‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
వరంగల్‌లో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్
వ‌రంగ‌ల్ భద్రకాళి అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక శక్తినిచ్చిందంటూ వ్యాఖ్య‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండగా, వరంగల్ అభివృద్ధి మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరంగల్‌కు వచ్చిన తొలి అధికారిక పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భద్రకాళి అమ్మవారి దర్శనం తనకు ఆధ్యాత్మిక శక్తినిచ్చిందని, ఆ ఆశీస్సులు పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గతంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రులతో కలిసి వచ్చిన అనుభవాన్ని గుర్తుచేశారు.

కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి

వరంగల్ నుంచి బీజేపీ ఎంపీలు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ములుగు సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్‌కు చెప్పుకోదగిన అభివృద్ధి లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రం చేసిన పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ పేరిట రూ.4 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క పనీ ప్రారంభించలేదన్నారు.

భూముల అమ్మకాలే ప్రభుత్వ ల‌క్ష్యం..ల‌క్ష‌ణం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కంటే భూముల అమ్మకాలపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత ఉన్నా పట్టించుకోకపోవడం, విశ్వవిద్యాలయ భూములపై ప్రభుత్వం కన్నేయడం దుర్మార్గమని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఉర్దూ యూనివర్సిటీ భూములపై జరుగుతున్న కుట్రలను ప్రస్తావించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చే జరగడం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. రైతు బంధు నిలిపివేత, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం మౌనం వహిస్తోందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే అమృత్, స్మార్ట్ సిటీ, హృదయ్ వంటి కేంద్ర పథకాలతో అభివృద్ధి ఎలా జరుగుతుందో చూపిస్తామని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి హ్యాండ్ఓవర్ చేస్తే మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ

ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని తెలిపారు. గతంలో 163 సర్పంచులు ఉండగా, ఇప్పుడు 900కి పైగా సర్పంచులు ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. బీజేపీలో వర్గాలు లేవని, మోదీ నాయకత్వమే ఒక్కటే వర్గం అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిఅని, ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్యపై పోరాడతామని తేల్చిచెప్పారు. సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రావు పద్మ రెడ్డి, డా. పగడాల కాళీ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, తుళ్ళ వీరేందర్ గౌడ్, యువ మోర్చా అధ్యక్షుడు గుండె గణేష్, అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్, రాష్ట్ర నాయ‌కుడు పేరం గోపికృష్ణ‌, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img