epaper
Thursday, January 15, 2026
epaper

Delhi Ashram: అసభ్య సందేశాలు.. లైంగిక వేధింపులు.. ఢిల్లీ స్వామీజీపై 17మంది అమ్మాయి ఫిర్యాదు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీలోని ఓ విలాసవంతమైన వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆశ్రమంలోని స్వామీజీపై లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. దాదాపు 17 మంది అమ్మాయిలు ఆ స్వామీజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ శారద ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్ మెంట్ లో పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి అనే స్వామీజీపై కేసు నమోదు చేశారు. బలహీన వర్గాల కేటగిరిలో పీజీ మేనేజ్ మెంట్ డిప్లామా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు స్వామీజీపై ఈ ఫిర్యాదు చేశారు.

విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం, స్వామీ చైతన్యానంద తరచుగా ద్వేషపూరితంగా మాట్లాడేవారని, అశ్లీలమైన మెసేజ్‌లు పంపేవారని తెలిపారు. అంతేకాదు, భౌతికంగా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఆశ్రమంలోని కొంతమంది సిబ్బంది, ముఖ్యంగా మహిళా వార్డెన్లు, డైరెక్టర్ ఆదేశాల ప్రకారం విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించారు.

ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు స్వామీ చైతన్యా నందపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. డీసీపీ అమిత్ గోయల్ సమాచారం ప్రకారం, ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆయన ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్నాడని సమాచారం రావడంతో అక్కడ గాలింపు ప్రారంభమైంది.

దర్యాప్తులో భాగంగా, ఆశ్రమ బేస్‌మెంట్‌లో ఉన్న ఒక వోల్వో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ వాహనాన్ని స్వామీజీ ఉపయోగించినట్లు తేలింది. ఆ కారుపై ఫేక్ డిప్లమాటిక్ నంబర్ ప్లేట్‌ (39 UN 1) అమర్చినట్లు బయటపడింది. దీంతో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

ఈ ఘటనల నేపథ్యంలో ఆశ్రమంపై వెంటనే చర్యలు తీసుకుంది. స్వామీ చైతన్యానందను అన్ని పదవుల నుంచి తొలగించామని ప్రకటించింది. శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠం కూడా స్పందించింది. ఆయన ప్రవర్తన అక్రమమని, పీఠం ఆచారాలకు విరుద్ధమని పేర్కొంటూ, అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ పీఠం యూనిట్‌లో రెండు బ్యాచ్‌లు ఉంటాయని, ఒక్కో బ్యాచ్‌లో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img