epaper
Thursday, January 15, 2026
epaper

విచారణ పేరుతో కాలయాపనా?

విచారణ పేరుతో కాలయాపనా?
డ్యూటీలోనే మద్యం సేవించిన అధికారులపై చర్యలేవీ?!
ప్రభుత్వ వాహనంలో ప్రైవేటు పార్టీకి మద్యం తరలింపు
సాక్ష్యాధారాలతో కథనం ప్రచురించిన కాకతీయ
నెలరోజులైనా ‘విచారణ’ పేరుతో జాప్యం
సామాన్యులపైనే ప్రతాపమా..?
సొంత శాఖ అధికారుల తప్పిదాలకు శిక్షలుండవా..?
బ‌హిరంగ ఉల్లంఘ‌ణ‌ల‌పైనా చూసి చూడ‌న‌ట్లే..!
మాముళ్ల మ‌త్తే అధికారుల వైఖ‌రి కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలోనే మద్యం తరలింపు, డ్యూటీలో ఉన్నప్పుడే మద్యం సేవించినట్లు వచ్చిన ఆరోపణలు వంటి అత్యంత తీవ్రమైన అంశాలు వెలుగులోకి వచ్చినా, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై సాక్ష్యాధారాలతో సహా కాకతీయ దినపత్రిక కథనాలు ప్రచురించినప్పటికీ, అధికారుల నుంచి వినిపిస్తున్న సమాధానం ఒక్కటే— “విచారణ జరుగుతోంది”. అయితే ఆ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? తప్పు చేసిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అన్న ప్రశ్నలకు మాత్రం నెలలు గడుస్తున్నా సమాధానాలు లేవు. అక్టోబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా కథనాలు వెలువడినా శాఖలో ఎలాంటి కదలిక కనిపించకపోవడం గమనార్హం. విచారణ బాధ్యతలు అప్పగించామన్న ప్రకటనలే తప్ప, నివేదికలు, నిర్ణయాలు, శిక్షలు ప్రజల ముందుకు రాకపోవడం ఎక్సైజ్ శాఖ పనితీరుపై అనుమానాలను మరింత బలపరుస్తోంది. నిజంగానే విచారణలు జరుగుతున్నాయా? లేక కాలం గడిపే ప్రక్రియగానే మిగిలిపోయాయా? అన్న సందేహాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

బహిరంగంగా ఉల్లంఘించినా..!

కరీంనగర్ నగరంలోని పలు వైన్స్, పర్మిట్ రూంలలో నిబంధనలకు విరుద్ధంగా డబుల్ సిట్టింగులు, అనధికార షెడ్లు, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ అక్రమాలు సాగుతున్నా, క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం అధికారుల మౌనానికి నిదర్శనంగా మారింది. ప్రతి వివాదాస్పద ఘటనపై అధికారులు ఇచ్చే సమాధానం ఒకే తీరుగా ఉండటం గమనార్హం— “సంబంధిత అధికారికి తెలియజేశాం… విచారణలో ఉంది”. అయితే ఈ మాటల తర్వాత ఒక్క చర్య కూడా కనిపించకపోవడంతో, ఇవి కేవలం మాటలకే పరిమితమైన ప్రకటనలుగా మిగులుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చర్యలు ఉండవన్న భావన బలపడటంతో వైన్స్ నిర్వాహకులు నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బలపడుతున్న అనుమానాలు

నెలలు గడుస్తున్నా ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన చర్యలు లేకపోవడం వెనుక నెలవారీ ముడుపుల వ్యవస్థే కారణమన్న అనుమానాలు కరీంనగర్ ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై వివరణ కోరగా కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించారు. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలో మద్యం తరలించిన ఘటనపై అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించామని, సోమవారం పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు. అలాగే వెంకటేశ్వర వైన్స్‌లో కొనసాగుతున్న నిబంధనల ఉల్లంఘనలు, డబుల్ పర్మిట్ రూం నిర్వహణపై వివరణ కోరగా, ఈ విషయాన్ని సంబంధిత ఎక్సైజ్ సీఐకి తెలియజేశామని చెప్పారు. అయితే ఈ ఘటనలు వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క స్పష్టమైన చర్య కూడా కనిపించకపోవడం పట్ల ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, విచారణలను వేగవంతం చేసి, తప్పు చేసిన వారు ఎవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img