epaper
Monday, March 2, 2026
epaper

విచారణ పేరుతో కాలయాపనా?

విచారణ పేరుతో కాలయాపనా?
డ్యూటీలోనే మద్యం సేవించిన అధికారులపై చర్యలేవీ?!
ప్రభుత్వ వాహనంలో ప్రైవేటు పార్టీకి మద్యం తరలింపు
సాక్ష్యాధారాలతో కథనం ప్రచురించిన కాకతీయ
నెలరోజులైనా ‘విచారణ’ పేరుతో జాప్యం
సామాన్యులపైనే ప్రతాపమా..?
సొంత శాఖ అధికారుల తప్పిదాలకు శిక్షలుండవా..?
బ‌హిరంగ ఉల్లంఘ‌ణ‌ల‌పైనా చూసి చూడ‌న‌ట్లే..!
మాముళ్ల మ‌త్తే అధికారుల వైఖ‌రి కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలోనే మద్యం తరలింపు, డ్యూటీలో ఉన్నప్పుడే మద్యం సేవించినట్లు వచ్చిన ఆరోపణలు వంటి అత్యంత తీవ్రమైన అంశాలు వెలుగులోకి వచ్చినా, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై సాక్ష్యాధారాలతో సహా కాకతీయ దినపత్రిక కథనాలు ప్రచురించినప్పటికీ, అధికారుల నుంచి వినిపిస్తున్న సమాధానం ఒక్కటే— “విచారణ జరుగుతోంది”. అయితే ఆ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? తప్పు చేసిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అన్న ప్రశ్నలకు మాత్రం నెలలు గడుస్తున్నా సమాధానాలు లేవు. అక్టోబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా కథనాలు వెలువడినా శాఖలో ఎలాంటి కదలిక కనిపించకపోవడం గమనార్హం. విచారణ బాధ్యతలు అప్పగించామన్న ప్రకటనలే తప్ప, నివేదికలు, నిర్ణయాలు, శిక్షలు ప్రజల ముందుకు రాకపోవడం ఎక్సైజ్ శాఖ పనితీరుపై అనుమానాలను మరింత బలపరుస్తోంది. నిజంగానే విచారణలు జరుగుతున్నాయా? లేక కాలం గడిపే ప్రక్రియగానే మిగిలిపోయాయా? అన్న సందేహాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

బహిరంగంగా ఉల్లంఘించినా..!

కరీంనగర్ నగరంలోని పలు వైన్స్, పర్మిట్ రూంలలో నిబంధనలకు విరుద్ధంగా డబుల్ సిట్టింగులు, అనధికార షెడ్లు, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ అక్రమాలు సాగుతున్నా, క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం అధికారుల మౌనానికి నిదర్శనంగా మారింది. ప్రతి వివాదాస్పద ఘటనపై అధికారులు ఇచ్చే సమాధానం ఒకే తీరుగా ఉండటం గమనార్హం— “సంబంధిత అధికారికి తెలియజేశాం… విచారణలో ఉంది”. అయితే ఈ మాటల తర్వాత ఒక్క చర్య కూడా కనిపించకపోవడంతో, ఇవి కేవలం మాటలకే పరిమితమైన ప్రకటనలుగా మిగులుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చర్యలు ఉండవన్న భావన బలపడటంతో వైన్స్ నిర్వాహకులు నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బలపడుతున్న అనుమానాలు

నెలలు గడుస్తున్నా ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన చర్యలు లేకపోవడం వెనుక నెలవారీ ముడుపుల వ్యవస్థే కారణమన్న అనుమానాలు కరీంనగర్ ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై వివరణ కోరగా కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించారు. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలో మద్యం తరలించిన ఘటనపై అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించామని, సోమవారం పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు. అలాగే వెంకటేశ్వర వైన్స్‌లో కొనసాగుతున్న నిబంధనల ఉల్లంఘనలు, డబుల్ పర్మిట్ రూం నిర్వహణపై వివరణ కోరగా, ఈ విషయాన్ని సంబంధిత ఎక్సైజ్ సీఐకి తెలియజేశామని చెప్పారు. అయితే ఈ ఘటనలు వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క స్పష్టమైన చర్య కూడా కనిపించకపోవడం పట్ల ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, విచారణలను వేగవంతం చేసి, తప్పు చేసిన వారు ఎవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img