epaper
Sunday, March 1, 2026
epaper

కొండబాలది దశాబ్దాల ప్రజా జీవితం : డిప్యూటీ సీఎం భట్టి

కొండబాలది దశాబ్దాల ప్రజా జీవితం
ప్రజల అవసరాలు తీర్చేందుకు చేయి చేయి కలిపి పని చేద్దాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ కండువా క‌ప్పిన డిప్యూటీసీఎం, పీసీసీ ప్రెసిడెంట్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత కొండబాల కోటేశ్వర రావు తో పాటు భారీ సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈసంద‌ర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విలేక‌రుల‌తో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేగా, టిడిపి జిల్లా అధ్యక్షునిగా సర్పంచి స్థాయి నుంచి మొదలుకొని ఎమ్మెల్యేగా దశాబ్దాల కాలాలపాటు రాజకీయ అనుభవం కలిగిన కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. స్థానిక సంస్థలు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా, టిఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనకు చట్టసభలపై చక్కని అవగాహన ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలను ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్దామని అన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకొని తీర్చేందుకు చేయి చేయి కలిపి పని చేద్దామని డిప్యూటీ సీఎం అన్నారు.

సొంత ఇంటికి వచ్చిన కొండబాలకు స్వాగతం : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

సొంత ఇంటికి తిరిగి వచ్చిన కొండబాల కోటేశ్వరరావుకు స్వాగతం తెలియజేస్తున్నానని, వారి చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న వాటిలో చేర్చుకుంటున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్లో చేరుతున్నాను: మాజీ ఎమ్మెల్యే,కొండ బాల కోటేశ్వరావు దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీలో చేరుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే కొండ బాల కోటేశ్వరావు ప్రకటించారు.

సుదీర్ఘ కాలంగా ఖమ్మం జిల్లాలో అనేక హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా జనరల్ సెక్రెటరీ స్థాయి వరకు వెళ్లానని, కాంగ్రెస్ అభ్యర్థిగా సమితికి సైతం పోటీ చేశానని కొండబాల తెలిపారు. ఈ దేశంలో పేద ప్రజల కోసం పని చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ అన్నారు, పేద ప్రజల కోసం పబ్లిక్ సెక్టార్ లో పరిశ్రమలను నెలకొల్పిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకి దక్కింది అన్నారు. పేద వర్గాల సంక్షేమం కోసం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం లో పనిచేస్తున్న SK డే ను భారతదేశానికి రప్పించి గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేశారని కొండబాల గుర్తు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, ఈ దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఈ నేపథ్యంలో తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అభివృద్ధికి తన వంతు పాత్ర ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కొండబాల ప్రకటించారు. తనతో పాటు ప్రస్తుతం కొంతమంది వచ్చారని రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొండబాల తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img