epaper
Thursday, January 15, 2026
epaper

డీఏల చెల్లింపు పూర్తి చేయాలి

డీఏల చెల్లింపు పూర్తి చేయాలి
తక్షణమే ప్ర‌భుత్వం స్పందించాలి
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ

కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై మానవీయ దృక్పథంతో తక్షణమే స్పందించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కోరారు. ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తండ్రి స్థానంలో నిలబడి ఉద్యోగుల సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఐదు విడతల డీఏ పెండింగ్
ప్రస్తుతం జనవరి–2023 వరకే డీఏ అమలులో ఉందని, ఆ తర్వాత ఐదు విడతల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఖాద్రీ తెలిపారు. జనవరి–2023 డీఏను కేంద్రం 24 మార్చి 2023న మంజూరు చేయగా, రాష్ట్రం 3.64 శాతం అమలు చేసి మొత్తం 30.03 శాతంగా చెల్లిస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జి.ఓ. ఎంఎస్. నెం.78 (13 జూన్ 2025) ద్వారా జారీ అయ్యాయని వివరించారు.

30 నెలలుగా బకాయిల భారం
జూలై–2023 డీఏ (3.64%)ను కేంద్రం 18 అక్టోబర్ 2023న మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రం అమలు చేయలేదని తెలిపారు. జనవరి–2024 (మొత్తం 37.31%), జూలై–2024 (40.04%), జనవరి–2025 (41.86%), జూలై–2025 (44.59%) డీఏలు కూడా వరుసగా 24, 18, 12, 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. డిసెంబర్–2025 నాటికి మొత్తం 14.56% డీఏ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు.
₹70,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఐదు విడతల డీఏ కలిపి సుమారు ₹1,98,744 బకాయిలు ఉన్నాయని ఖాద్రీ వివరించారు. నెలవారీగా రావాల్సిన జీత పెరుగుదల సుమారు ₹10,192 అయినప్పటికీ ఉద్యోగులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విడతల వారీగా అయినా చెల్లించాలి
ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముకలని, వారి ఆర్థిక భద్రతను నిర్లక్ష్యం చేయరాదని ఖాద్రీ స్పష్టం చేశారు. ఖజానాపై భారం తగ్గేలా విడతల వారీగా అయినా డీఏ బకాయిలను విడుదల చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులు–ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img