epaper
Thursday, January 15, 2026
epaper

ఆయుధాలు వదిలేస్తం.. మావోయిస్టుల సంచలన నిర్ణయం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్ట పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా సాగుతున్న సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ఇస్తూ, చర్చలకు సిద్ధమని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌ పేరిట ఒక లేఖ విడుదలైంది. దేశం, ప్రపంచం మారుతున్న పరిణామాల దృష్ట్యా ఇకపై ఆయుధాలను విడిచి ప్రధాన స్రవంతిలో కలిసిపోవాలన్న ఆలోచనకు పార్టీ అంగీకరించినట్టు లేఖలో స్పష్టం చేశారు. 30 రోజులపాటు కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించాలని కోరుతూ, ఆ గడువులో సహచరులతో చర్చలు జరుపుతామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అవసరమైతే ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలతో కలిసి పోరాడతామని మావోయిస్టులు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి లేదా ఆయన ప్రతినిధులతో, వీడియో కాల్ ద్వారానైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మృతి తరువాత, తిప్పిరి తిరుపతి కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంతోనే అభయ్‌ పేరిట లేఖ వెలువడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, మావోయిస్టు నాయకుని ఫోటోతో లేఖ విడుదల కావడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు.

మార్చి నెలలోనే శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మావోయిస్టులు అభ్యర్థించారని, అదే విషయాన్ని మే 10న కూడా ఒక ప్రకటనలో స్పష్టం చేసినట్టు లేఖలో గుర్తుచేశారు. ఈసారి మాత్రం ఆయుధ విరమణ, కాల్పుల విరమణపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గత సంవత్సరం నుంచి భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాయని, మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ ప్రధాన కార్యదర్శి బసవరాజుతో పాటు పలువురు కీలక నాయకులు వీరమరణం పొందారని పార్టీ లేఖలో పేర్కొంది.

అయినప్పటికీ, మధ్యలో ఆగిపోయిన శాంతి చర్చలను మళ్లీ ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ కొత్త నిర్ణయమని వెల్లడించారు.మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు మొదటిసారిగా ఆయుధాలను విడిచి పెట్టేందుకు, కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ నిర్ణయం, వారి కొత్త నాయకత్వంలో పార్టీ వైఖరి మారుతున్న సంకేతంగా పరిగణించబడుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img