epaper
Sunday, March 1, 2026
epaper

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం.. హాజరైన మోదీ, ధన్ ఖడ్, చంద్రబాబు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్‌, వెంకయ్య నాయుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు.

జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అవసరమయ్యాయి. ఎన్డీఏ తరఫున సీపీ రాధాకృష్ణన్ రంగంలోకి దిగగా, ప్రతిపక్షం తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఈనెల 9న జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ 152 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంచనాల ప్రకారమే ఆయన విజయం సాధించారని చెప్పవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు తాత్కాలికంగా అప్పగించారు.

సీపీ రాధాకృష్ణన్‌ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. ఆయన 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. బీబీఏ పట్టభద్రుడైన ఆయన విద్యార్థి దశలో టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్‌లపై ఆసక్తి చూపారు. భారత మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రేరణతో ఆయన తల్లి తన కుమారునికి రాధాకృష్ణన్ అనే పేరు పెట్టారు.

రాధాకృష్ణన్ 16వ ఏట నుంచే ఆర్ఎస్సెస్, జనసంఘ్‌లతో అనుబంధం కలిగి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 1998, 1999లో కోయంబత్తూరు నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుండి 2007 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ కాలంలో 93 రోజులపాటు 19,000 కి.మీ. రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరానితనం నిర్మూలన, ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాలు చేపట్టారు.

2014, 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు. 2023లో తొలిసారి ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులై, తరువాత తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులై, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు వరకు ఆ పదవిలో కొనసాగారు.

ఎంపీగా ఉన్న సమయంలో రాధాకృష్ణన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ-జౌళి చైర్మన్‌గా, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ కమిటీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వంటి పలు కీలక కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2004లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి బృందంలో భాగమయ్యారు. తైవాన్‌కు వెళ్లిన తొలి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో కూడా పాల్గొన్నారు. 2016–2020 మధ్యకాలంలో కాయిర్-కొబ్బరి పీచు బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 2020లో కేరళ BJP వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులై 2022 వరకు సేవలందించారు. సీపీ రాధాకృష్ణన్, తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన మూడో వ్యక్తి. ఆయనకు ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్‌. వెంకటరామన్ ఈ గౌరవాన్ని పొందారు. ప్రస్తుతం దేశ రెండవ అత్యున్నత పదవికి ఎన్నికై ఆయన కొత్త అధ్యాయం ప్రారంభించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img