epaper
Tuesday, November 18, 2025
epaper

కాంగ్రెస్ నయవంచన పాలన‌

కాంగ్రెస్ నయవంచన పాలన‌
ఆరు గ్యారెంటీలు అన్‌గ్యారెంటీలుగా మారాయి
42% బీసీ రిజర్వేషన్ కూడా డ్రామానే
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కాకతీయ,హుజురాబాద్: మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా పాలన పేరిట సంబరాలు చేసుకోవడం అసలు హాస్యాస్పదమ‌ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు రెండు సంవత్సరాల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, అవన్నీ ‘అన్‌గారెంటీలుగా’ మారిపోయాయన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మాటల గారడీతోనే పాలన కొనసాగుతోందన్నారు. పథకాలు అన్నీ గాల్లో కలిసిపోయాయ‌ని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఎన్నికల నాటకమే బీసీల ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ 42% రిజర్వేషన్ల డ్రామా ప్రదర్శించిందని గంగాడి ఆరోపించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా బీసీల కోసం పోరాడిందా? నేడు మాత్రం ఎన్నికలు దగ్గరగా రావడంతో కొత్త నాటకాలు వేస్తోంది అని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో బుధవారం హుజురాబాద్‌లో జరిగే బూత్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరవుతారని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి నరసింహరాజు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, గుజ్జ శ్రీనివాస్, రాముల కుమార్, తూర్పాటి రాజు, కొలకాని రాజు, సంపెల్లి సంపత్ రావు, బైరెడ్డి రమణారెడ్డి, బత్తిని నరేష్, ర్యాకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జాత‌ర‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు

జాత‌ర‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు గోలివాడలో సమ్మక్క సారలమ్మ జాతర పనులపై కలెక్టర్...

నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా

నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా మాదకద్రవ్యాల...

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలకు...

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి సురక్షిత డ్రైవింగ్‌పై ప్రజలకు విజ్ఞప్తి కరీంనగర్ పోలీస్ కమిషనర్...

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది ఫౌండేషన్ ఇంచార్జ్ బియ్యాల దినేష్ కాకతీయ,...

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల సిసిఐ నిబంధనలు సడలించాలి మిల్లుల సమ్మె వెంటనే...

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ 21 నుంచి మహోత్సవాలు కాకతీయ, కరీంనగర్...

23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి కాకతీయ, లక్షెట్టిపేట :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img