పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం
కాకతీయ,పరకాల : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 22 వార్డుల్లో 13 వార్డులు కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో పట్టణ పాలనపై పట్టు సాధించింది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ 6 వార్డులతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ 3 వార్డుల్లో విజయం సాధించింది. అయితే మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకునే స్థితిలో ఉంది.
ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టణ ప్రజలు మెజారిటీ మద్దతు ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పట్టణంలో పలువురు వార్డుల్లో ఉత్కంఠభరిత పోటీ నెలకొన్నప్పటికీ, తుది ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలలో మునిగితేలుతున్నారు.


