epaper
Saturday, November 15, 2025
epaper

కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బడే నాగజ్యోతి

కాకతీయ, ములుగు : రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అసెంబ్లీలో కాళేశ్వరంపైన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం ములుగు మండలకేంద్రంలో జాతీయ రహదారి163పై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగుకోట్ల ప్రజల హక్కులను రేవంత్ రెడ్డి కాలరాచాడని ఆమె అన్నారు.

పోరాటాలతో సాధించిన తెలంగాణ గడ్డపై ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర ప్రయోజనాల కోసం రేవంత్ ఆరాటపడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఏపీకి గోదావరి జిల్లాలను రాసి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు అయ్యాయని, అసెంబ్లీలో జరిగిందంతా తెలంగాణను బలిపెట్టి బనకచర్ల కోసం రేవంత్ ఆడిన బాగోతం తప్ప ఇంకోటి కాదని అన్నారు. కాలేశ్వరంపై సీబీఐ విచారణ అనేది ఒక పార్టీ పైన జరుగుతున్న దాడి కాదు మొత్తంగా తెలంగాణను ఏడారిగా మార్చే విద్రోహ చర్య భావిస్తున్నామని, ఒక వైపు రేవంత్ మరోవైపు బాబు ఇంకోవైపు మోడీ ముగ్గురు కలిసి తెలంగాణను శాశ్వతంగా దెబ్బతీసే దుర్మార్గమైన కుట్రలు తెరతీశారని ఆరోపించారు.

తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం ప్రాజెక్టును బలి చేసేందుకు బాబు తెరపైకి తెచ్చిన బనకచర్ల తోనే ఈ మొత్తం కుట్రలకు బీజం పడిందన్నారు. ఒకవైపు బనకచర్ల ముప్పుతో పాటు ఇచ్చంపల్లిని తెరపైకి తెచ్చి మొత్తంగా మేడిగడ్డను ముంచే కుతంత్రం చేస్తున్నారని, తెలంగాణ రైతుకు మరణ శాసనం రాయాలన్నది ముగ్గురు కలిసి ఆడుతున్న పన్నాగమని ఆమె అన్నారు.

కాలేశ్వరం కమిషన్ నుంచి సిబిఐ విచారణ దాకా ప్రతి దాని వెనక మోడీ, చంద్రబాబు, రేవంత్ హస్తం ఉందని, ప్రియాంకగాంధీ సిబిఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వారిని వేధిచడానికి మోడీ వాడుకుంటున్నారని నిలదీయలేదా అని ప్రశ్నించారు. అప్పుడు సిబిఐ తప్పు అయినప్పుడు ఇప్పుడు ఒప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని కోర్టులో నిలబడి గోష్ నివేదిక బూచీగా చూపెట్టి బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img