epaper
Saturday, November 15, 2025
epaper

రైతుల‌ను రోడ్డు మీదేసిన కాంగ్రెస్‌

రైతుల‌ను రోడ్డు మీదేసిన కాంగ్రెస్‌
అన్న‌దాత‌ల‌కు శాపంగా కాంగ్రెస్ పాలన
యూరియా కొరతపై తీవ్ర విమర్శలు
రైతు బీమా.. పంటల బీమాపై నిర్లక్ష్యం
కాంగ్రెస్.. బీజేపీల మ‌ధ్య మైత్రి బంధం
మాజీమంత్రి, బీఆర్ ఎస్ నేత సింగిరెడ్డి, నిరంజ‌న్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో రైతాంగం గోస ప‌డుతోంద‌ని, రాష్ట్రాన్ని బాగు చేస్తార‌ని న‌మ్మి ఓట్లేస్తే.. రైతుల‌ను న‌డి రోడ్డున నిల‌బెడుతున్నారంటూ వ్య‌వ‌సాయ‌శాఖ మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఒక్క యూరియా బ‌స్తాకు భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ క్యూ లైన్ల‌లో నిల్చోవాల్సి వ‌స్తోంద‌ని విమ‌ర్శించారు. రైతాంగం, సాగు అవ‌స‌రాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు చూపు వైఖ‌రి లేక‌పోవ‌డ‌మే రైతుల క‌ష్టాల‌కు కార‌ణ‌మ‌ని అన్నారు. చేసిన త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు అడ్డ‌గోలుగా వాద‌న‌లు వినిపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భవన్‌లో శ‌నివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పుట్ట మధు, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తనోబా తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ జై జవాన్.. జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు రైతులను రోడ్ల మీద పడేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 117.83 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నట్లు అధికారులు ప్ర‌ణాళిక‌లు, నివేదిక‌లు ప్ర‌భుత్వానికి అందినా.. ఎరువుల ఇండెంట్‌, స‌ర‌ఫ‌రాలో ప్ర‌భుత్వం ఘెరంగా వైఫ‌ల్యం చెందింద‌ని సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. కేంద్రం తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు 5.25 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే సరఫరా జరిగిందన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల పైగా లోటు ఉందని తెలిపారు. మార్క్‌ఫెడ్ వద్ద 2 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉండాలని, కానీ కేవలం 23 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంద‌న్నారు. బీఆర్ఎస్ హయాంలో 2022లో 1.35 కోట్ల ఎకరాలలో సాగు జరిగి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యింది. ఇప్పుడు వరి సాగు తగ్గినా యూరియా సరఫరా చేయలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యమ‌ని విమర్శించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌ప్పుల‌ను ఒక‌రిపై ఒక‌రు వేసుకుంటూ రైతాంగానికి క‌ష్టాలు మిగుల్చుతున్నార‌ని అన్నారు.

రైతు బీమా.. పంటల బీమాపై నిర్లక్ష్యం..

రైతు బీమా పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీమంత్రి ఆరోపించారు. గత ఏడాది ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడంతో 5 వేల కుటుంబాలు బీమా ప్రయోజనం కోల్పోయాయని గుర్తు చేశారు. ఈ ఏడాది రూ.1359.66 కోట్లు అవసరమయ్యే రైతు బీమా ప్రీమియం సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, పంటల బీమా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు మునిగిపోయినా, ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీ మైత్రి

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య మైత్రి బంధం కొన‌సాగుతోంద‌ని సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం, పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో రెండు పార్టీలు కలిసి రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టాయని అన్నారు. ఐదేళ్లు ఫలితాలు ఇచ్చిన కాళేశ్వరం నీటిని వదిలేసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు అని తీవ్రంగా విమర్శించారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, రైతు సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైంది. యూరియా కూడా సకాలంలో అందించలేని ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా? అంటూ ప్రశ్నించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img