epaper
Monday, March 2, 2026
epaper

కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
ఉద్రిక్తతల నడుమ బైఠాయింపు
పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్

కాకతీయ, కరీంనగర్ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపుమేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరి, చైతన్యపురి కాలనీలో ఉన్న బీజేపీ ఎంపీ క్యాంపు కార్యాలయానికి శాంతియుతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ముందస్తు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుందన్న అంచనాతో పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పీటీసీకి తరలించారు.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర సంస్థలను దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించారని, కోర్టు తీర్పుతో బీజేపీ రాజకీయ కక్ష స్పష్టమైందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో నెహ్రూ కుటుంబం స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కాపాడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు విరాళాలు ఇచ్చారని గుర్తు చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి అక్రమాలు లేవని కోర్టు తేల్చిన నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ద్వారా వేధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుత నిరసనకు వెళ్లిన తమను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిరాజు హుస్సేన్, బానోతు శ్రావణ్ నాయక్, అరుణ్ కుమార్, మల్లికార్జున రాజేందర్, ఆకారపు భాస్కర్ రెడ్డి, కర్ర రాజశేఖర్, కల్వల రామచందర్, లింగంపల్లి బాబు, బోనాల శ్రీనివాస్, అబ్దుల్ రహమాన్, మూల రవీందర్ రెడ్డి, చర్ల పద్మ, అహమ్మద్ అలీ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఇమ్రాన్, వీర దేవేందర్, కామ్రెడ్డి రాంరెడ్డి, సలీముద్దీన్, ఎస్.ఏ. మోసిన్, పడిశెట్టి భూమయ్య, కాశెట్టి శ్రీనివాస్, కోటగిరి భూమా గౌడ్, పొన్నం మధు, మునిగంటి అనిల్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కోడూరి రవీందర్ గౌడ్, గంట కళ్యాణి, హసీనా, మీసా రమాదేవి, స్వప్న శ్రీ, బషీరుద్దీన్, కుర్ర పోచయ్య, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సరిల్ల రతన్ రాజు, సాయిని తిరుపతి, జీడి రమేష్, తోట అంజయ్య, మంద మహేష్, శిల్పా, సుదర్శన్, కొండ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img